BHNG: భయాందోళనలో చెందకుండా, ఇంటర్మీడియట్ విద్యార్థులు, సకాలంలో హాజరై పరీక్షలు రాయాలని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష నిర్వహణను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేశారు.