SKLM: అక్రమంగా తరలిస్తున్న పశువులను మందస పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చాపురం నుండి పలాస వైపు వెళ్లే రెండు బొలెరో వాహనాలలో 13 గేదెలను తరలిస్తుండగా హరిపురం జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పశువులను రక్షణ నిమిత్తం పశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఈ ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై కె కృష్ణ ప్రసాద్ తెలిపారు.