HYD: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ముఖ్యంగా నారాయణగూడ నుంచి హిమాయత్నగర్ వైపు వాహనాల రాకపోకలు మందగించాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరడంతో రోడ్లపై ట్రాఫిక్ పెరిగింది. వాహనదారులు ముందుగానే బయలుదేరి, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.