NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27వ తేదీన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుజాత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూత్ రెడ్ క్రాస్ కమిటీ, బొల్లినేని హాస్పిటల్ వారి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు.