ASR: పోలవరం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు పంపిణీ చేస్తున్న చిక్కీల (పల్లీ అచ్చులు) నాణ్యతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రంపచోడవరం, చింతూరు డివిజన్లలోని పాఠశాలలకు అందుతున్న చిక్కీలలో పురుగులు కనిపిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.