MBNR: మిడ్జిల్ మండలం వేములలో నిర్మిస్తున్న లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళగడ్డ గ్రామపంచాయతీకి చెందిన భాస్కర్ నాయక్ తన దాతృత్వాన్ని చాటుకుంటూ ఆలయ నిర్మాణానికి రూ.1,50,000 విరాళాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ఆలయ కమిటీ ఛైర్మన్ జంగయ్య ఆయనను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.