AKP: అనకాపల్లి దేవుని గుమ్మంలో వేంచేసియున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ బి. శ్రీనివాసరావు, ఈవో చంద్రతేజ తెలిపారు. 27 ఉదయం ధ్వజారోహణ, రాత్రి కళ్యాణ మహోత్సవం, 28న అన్న సమారాధన జరుగుతుందన్నారు. మార్చి1న అర్ధ ఏకాహం, 2న గరుడ వాహనంపై పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉంటుందన్నారు.