TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన స్వామివారి తిరుకల్యాణోత్సవం ఈ రాత్రి కన్నుల పండుగగా జరగనుంది. అంతకుముందు ఉదయం స్వామివారు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో కొండపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.