ప్రకాశం: గిద్దలూరు సీడీపీవో కార్యాలయం ముందు మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. లేబర్ కోడ్స్ రద్దు చేసి, పాత చట్టాలనే అమలు చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీలకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు.