ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 214 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని 38.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో అలిస్సా హీలీ(50), బెత్ మూనీ(76) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది. కాగా, రెండో వన్డే ఈనెల 27న జరగనుంది.