AP: హెరిటేజ్ సంస్థపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాను రాజకీయాల్లో ఉన్నానని, అందుకే నియమాలు పెట్టుకున్నామని వెల్లడించారు. ఏ దేవాలయానికి పాలు, నెయ్యి సరఫరా చేయొద్దని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవిస్తామని పేర్కొన్నారు. వేంకటేశ్వర స్వామి భక్తుడిగా తాను బతికి ఉన్నంత వరకు స్వామి వారి పవిత్రత కాపాడుతానని హామీ ఇచ్చారు.