AP: కూటమి ప్రభుత్వంపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన ఫైర్ అయ్యారు. ‘ఏడుకొండలను YSR రెండు కొండలు చేయాలని కుట్ర చేసినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఏడుకొండలు శ్రీవారివే అని దివంగత YSR జీవో ఇచ్చారు. గతంలో బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన జీవోను YSR సవరించారు’ అని భూమన వెల్లడించారు.