కడప నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ఎన్.మనోజ్ రెడ్డి మంగళవారం ఉదయం నగరంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. 17వ డివిజన్లో టీజీపీ పార్కును సందర్శించి పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం 15వ డివిజన్లో ఏర్పాటు చేయనున్న సాగర్ కాలనీ పార్కులో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.