NTR: ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధానలక్ష్యమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. కొండపల్లిలోని పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను తెలుసుకున్నారు. 60 మంది అర్జీలు సమర్పించారు. సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.