ATP: అనంతపురం మదర్ మిల్క్ బ్యాంక్ మొదటి వార్షికోత్సవం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై సేవలను పరిశీలించారు. ఇప్పటి వరకు 480 లీటర్ల పాలు సేకరించి, 4 వేల మంది చిన్నారులకు అందించడం గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు.