MBNR: బీఆర్ఎస్ నేత ఒకరు ఎస్సీ, ఎస్టీలకు చెందిన 600 ఎకరాల భూమిని కబ్జా చేశారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం ఆరోపించారు. కొండకల్, మోకిల ప్రాంతాల్లో 1,100 ఎకరాల గిరిజనుల భూములు కొట్టేసిన వారు త్వరలోనే జైలుకు వెళ్తారని హెచ్చరించారు. త్వరలోనే వీటికి సంబంధించిన ఆధారాలు బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.