MLG: నాగర్కర్నూల్ జిల్లాలో రెండు నెలల పసిపాప మృతికి కారణమైన దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం జిల్లా కార్యదర్శి కోయల నర్సింహారావు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. పోలీసుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ చేపట్టాలని తెలిపారు.