• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఈ నెల 24న మినీ జాబ్ మేళా

మంచిర్యాల ప్రభుత్వ ITI కళాశాలలో ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఆదివారం ప్రకటనలో తెలిపారు. శృతి గోలిస్ బర్త్ రూట్ ఆస్పత్రిలో డాటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, హౌస్ కీపింగ్, ఫార్మసిస్ట్, సిస్టం ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 11:05 AM IST

రహదారి గుంతలమయం.. వాహనదారులకు నరకయాతన

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధి 47వ డివిజన్ మార్కండేయ కాలనీలోని కృష్ణుడి ఆలయం సమీప ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతింది. వాహనదారులు తరచుగా వాహన మరమ్మతులతో ఆర్థిక నష్టానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా మ్యాన్‌హోల్ లీకేజీ కారణంగా మురుగునీరు నిల్వ ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 11:04 AM IST

‘గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలి’

KMM: సత్తుపల్లి పట్టణంలో పాకలగూడెం గ్రామ నూతన సర్పంచ్ సునీత TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి చేరవేయాలని సర్పంచ్‌కు సూచించారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని తెలిపారు.

February 22, 2026 / 11:02 AM IST

టార్గెట్ ఫిక్స్ అయింది .. ఇక పనుల జాతరే..!

NLG: జిల్లా కేంద్రం ‘వీబీ జీ రామ్ జీ’ పథకంలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 లక్షల కుటుంబాలకు 125 రోజుల పని దినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్లగొండ జిల్లాలో 7.44 లక్షల జాబ్ కార్డు ఉండగా ఇందుకోసం రూ.1.16 కోట్ల పని దినాలను అంచనా వేశారు. అవినీతిని అరికట్టేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 11:02 AM IST

నూతన పాలకవర్గానికి మంత్రి అభినందనలు

RR: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఇటీవల మోయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు, నూతన పాలకవర్గానికి మంత్రి అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా ముందుకు పోవాలన్నారు.

February 22, 2026 / 11:01 AM IST

మక్తల్ రహదారి ప్రమాదకర పరిస్థితి..!

NRPT: మక్తల్ మండలంలోని జక్లేర్ నుంచి రామసముద్రం వరకు రహదారిలో మలుపుతిరిగే ప్రాంతంలో గుంతలు ఏర్పడడంతో స్థానికులు, వాహనదారులు భయపడుతున్నారు. రాత్రి సమయాల్లో ఘోర ప్రమాదాలు జరిగే అవకాశాన్ని వాపోతున్నారు. అధికారులు వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

February 22, 2026 / 11:00 AM IST

నీటి సంపులో పడి బాలిక మృతి

RR: ఆడుకుంటూ వెళ్లి బాలిక నీటి సంపులో పడి మృతి చెందిన ఘటన మంచాల మండల పరిధిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తాళ్లపల్లిగూడలో ఆడుకునేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. దీంతో ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో బాలిక మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 10:58 AM IST

పార్టీ నేత మృతదేహానికి నివాళులర్పించిన బొల్లం

SRPT: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఓబులు మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఓబులు భౌతికకాయానికి ఆయన నివాళులర్పించి, పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం శోకసప్త కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు.

February 22, 2026 / 10:56 AM IST

‘నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు’

ASF: సింగిల్ యూజ్‌డ్ ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధమని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ బీ.తిరుపతి ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర నిషేధిత వస్తువులను విక్రయిస్తున్న వ్యాపారులను గుర్తించి సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు ప్లాస్టిక్‌కు బదులు పర్యావరణ హితమైన వస్తువులను వినియోగించాలన్నారు.

February 22, 2026 / 10:56 AM IST

కామారెడ్డిలో వార్.. ముగింపు కార్డు పడనుందా..?

KMR: సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డి రణరంగంగా మారింది. అభివృద్ధి విషయంలో పోరాడాల్సిన వారే ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి ఇరు పార్టీల అధినేతలు వెళ్లి సంబంధిత అంశాలపై చర్చించి నిజానిజాలు తేల్చుకుంటారా! ఈ అంశాలపై ముగింపు కార్డు వేస్తారా! అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

February 22, 2026 / 10:56 AM IST

‘ప్రజలపై మరింత విశ్వాసం పెంచాలి’

KMM: సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ రహానా బేగం కమల్ పాషా, వైస్ ఛైర్మన్ సుమలత వేణు, అలాగే సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లను ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రాగమయి సత్కరించారు. ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసేలా పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే వారికి తేనెటీ విందు ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 10:55 AM IST

‘మహాసభను జయప్రదం చేయండి’

BDK: ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే కమ్యూనిస్ట్ మహాసభను జయప్రదం చేయాలని మాజీ సర్పంచ్ శ్రీను తెలిపారు. ఇల్లందు మండలం పోచారం గ్రామంలో పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. భారతదేశం ఒక అర్ధ వలస, అర్ధ బుస్వామ్య వ్యవస్థ అని, దీనిని కూల్చివేసి నూతన వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం విప్లవ పందా మార్గంలో అందరం నడవాలని అన్నారు.

February 22, 2026 / 10:55 AM IST

బోరుకు మరమ్మతు చేయించిన వార్డు కౌన్సిలర్

నిర్మల్: ఖానాపూర్ పట్టణం గాంధీ నగర్ కాలనీలోని బోరు చెడిపోయి ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ గొర్రె తిరుమల ఘటన స్థలానికి చేరుకుని దగ్గరుండి సిబ్బందితో బోరు రిపేర్ చేయించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 10:53 AM IST

మురళీకృష్ణుడి అవతారంలో లక్ష్మీ నరసింహుడు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం ఉదయం శ్రీ కృష్ణాలంకారములో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ ఉండనుంది. స్వామివారి దర్శనానికి భక్తులు యాదగిరిగుట్టకు భారీగా తరలి వస్తున్నారు.

February 22, 2026 / 10:50 AM IST

రేపటి నుంచి ‘ప్రజావాణి’ పునఃప్రారంభం

ASF: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రేపటి నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో యథావిధిగా వినతుల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

February 22, 2026 / 10:47 AM IST