MHBD: కురవి మండలకేంద్రంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పార్వతీ రామలింగేశ్వర (శివాలయం) స్వామి ఆలయం వద్ద దోపోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు.
SRCL: గ్రామపంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను ప్రభుత్వం చెల్లించాలంటూ ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట కార్మికులతో ధర్నా చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి ప్రకటించారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్లోని అమృత్లాల్ శుక్లా కార్మిక భవనంలో శనివారం సీఐటీయూ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
HNK: ఐనవోలు మండలం కేంద్రంలోని ఐనవోలు గ్రామ సర్పంచ్ గడ్డం వంశీ కృష్ణా ఆదివారం గ్రామంలో వచ్చే వేసవి కాలంలో నీటి సమస్యలు రాకుండా చూసే విధంగా వార్డు సభ్యులతో కలిసి గ్రామంలోని నిరూపయోగంగా ఉన్న నీటి ట్యాంక్లను పరిశీలించారు. ఈ సందర్భంలో ట్యాంక్ల పరిస్థితి, పరికరాలు, అవసరమైతే మరమ్మతులు, శుభ్రత వంటి అంశాలను గమనించారు. సర్పంచ్ వంశీకృష్ణా తెలిపారు.
MDK: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన తూప్రాన్ మండలం ఇమాంపూర్లో చోటుచేసుకుంది. స్థనికుల వివరాలు.. గ్రామానికి చెందిన రైతు అల్లాడి శంకర్ (40) నిన్న సాయంత్రం పొలానికి మందులు చల్లి స్నానం చేసేందుకు చెరువులో దిగి గల్లంతయ్యాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్ద గాలించారు. ఆదివారం ఉదయం చెరువులో శవమై తేలాడు. భార్య లావణ్య, ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు.
WGL: జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిన్న సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవికాలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి100, నుంచి 150 లీ, మంచినీరు సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు.
HYD: సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి ఇంఛార్జ్ సూపరింటెండెంట్గా అనస్తీషియా విభాగాధిపతి ప్రొ.ఆవుల మురళీధర్ను వైద్య ఉన్నతాధికారులు నియమించారు. సూపరింటెండెంట్ ప్రొ.వాణి విదేశాలకు వెళ్లడంతో ఆమె తిరిగివచ్చే వరకు ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తి చేశారు.
WGL: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేడు నిర్వహించనున్న ఆర్యవైశ్య మహాసభలో పాల్గొనడానికి వరంగల్ నుంచి GT ఎక్స్ప్రెస్ రైల్లో ఢిల్లీకి ఆర్యవైశ్య సంఘ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య జిల్లా గౌరవ అధ్యక్షుడు గంద శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల హక్కులు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
NGKL: జిల్లాలో యూరియా యాప్ ద్వారా 46,529 మంది రైతులకు 2.18 లక్షల యూరియా బస్తాల పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ సంతోష్ శనివారం పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లు లేని రైతులు మండల వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 24 యూరియా బస్తాల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.
ADB: నార్నూర్లో ప్రభుత్వ భూమిని అక్రమంగా తవ్వి మట్టిని తరలిస్తున్న ఉదంతం కలకలం రేపింది. ఓ పెట్రోల్ బంక్ నిర్మాణానికి అవసరమైన మట్టిని అధికారులు అనుమతి లేకుండానే కాంట్రాక్టర్ రాత్రుళ్లు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా ఆస్తిని దోచుకుంటూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. భద్రాచల సీతారామయ్య కళ్యాణ తలంబ్రాలను రూ.151లకే అందించనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బస్ భవన్లో శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణకు చెందినవారు ఈ నెల 23వ తేదీన www.tgartclogistics.co.inలో రిజిస్టర్ చేసుకోవాలని, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం తలంబ్రాలు అందజేస్తామని ఆయన వివరించారు.
BHPL: చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఏకు సారయ్య (55) రేగొండ మండలం కొడవటంచలోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ప్రతి వారం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే సారయ్య, ఈ నెల 17న ఆలయానికి వచ్చి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బావిలో దుర్వాసన రావడంతో పరిశీలించగా మృతదేహం లభ్యమయింది.
MHBD: గూడూరు మండలం అటవీ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో శనివారం అర్థరాత్రి తవ్వకాలు చేశారు. సీతానగరం గ్రామ యువకులు ఆ వ్యక్తులను ఆరా తీశారు. వారు పోంతనలేని సమాధానం ఇచ్చారు. దీంతో యువకులు అటవీశాఖ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చేలోపో వారు అక్కడి నుంచి పరారయ్యారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
MDK: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23 నుంచి మండల స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదే రోజు కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారని, మార్చి 2 నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.
SRPT: మునగాల మండలం నారాయణ గూడెంలో దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేడు పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామంలో అగ్రవర్ణాల వ్యక్తులు దళితులపై దాడి చేసినా, పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని బాధ్యత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించనున్నట్లు సమాచారం.