• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

NGKL: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

February 22, 2026 / 12:33 PM IST

‘ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది’

SRPT: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే మా ప్రజా ప్రభుత్వ ద్వేయమని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట మండలం కాసరబాధ గ్రామంలో దూడిగ రాములు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నెరవేర్చి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలియజేశారు.

February 22, 2026 / 12:32 PM IST

BRS అండగా ఉంటుంది.. మాజీ ఎమ్మెల్యే భరోసా

RR: చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు అరవింద్ రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అరవింద్ రెడ్డికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

February 22, 2026 / 12:30 PM IST

ఈటల ఇంటి ముందు ఉద్రిక్తత

HYD: శామీర్‌పేటలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే హౌస్ అరెస్ట్‌లో ఉన్న ఈటల నివాసానికి పోలీసులు మరోసారి చేరుకుని బయటికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిపై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

February 22, 2026 / 12:28 PM IST

జిల్లా వ్యాప్తంగా భగ్గుమంటున్న ఎండలు..!

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వేడి గాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు.

February 22, 2026 / 12:26 PM IST

రేపటినుండి సర్పంచులకు, వార్డు సభ్యులకు శిక్షణ

MNCL: జన్నారం మండలంలోని సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంపీవో జలంధర్ తెలిపారు. మంచిర్యాల మండలంలోని ముల్కాల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుంచి సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. మండలంలోని 10 గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు పోన్కల్ రైతు వేదికలో శిక్షణ ఉంటుందన్నారు.

February 22, 2026 / 12:24 PM IST

మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

SRD: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని MLA గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఫాల్గొన్నారు.

February 22, 2026 / 12:18 PM IST

మేయర్, డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా దరణి మధుకర్, డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య మహేష్ ఆదివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. MLA సహకారంతో కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో పయనించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

February 22, 2026 / 12:16 PM IST

కేటీఆర్‌ను కలిసేందుకు పాదయాత్ర

MBNR: కోయిలకొండ అంకిళ్ల గ్రామానికి చెందిన కావలి రామచందర్ ముదిరాజ్ తన అభిమాన నేత కేటీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు. కేటీఆర్ నాయకత్వానికి గౌరవం చూపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపారు. బంజారాహిల్స్ తెలంగాణ భవన్లో ఆయన కేటీఆర్‌ను కలిసిన తర్వాత మద్దతు తెలపడం లక్ష్యమని చెప్పాడు.

February 22, 2026 / 12:15 PM IST

రేపు జిల్లాలో ప్రజావాణి యథాతథం

SRCL: జిల్లాలో ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్లు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 12:15 PM IST

నూతన ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి

JGL: ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 5 లక్షలు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 12:11 PM IST

‘బీజేపీ పార్టీతోనే అభివృద్ధి’

JN: బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఘనపూర్లో నేతలతో కలిసి వెంకటేశ్వర్లు పరిశీలించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారని అన్నారు.

February 22, 2026 / 12:10 PM IST

దుర్బాతండాలో పర్యటించిన బోథ్ ఎమ్మెల్యే

ADB: నెరడిగొండ మండలంలోని దుర్బాతండా గ్రామంలో ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే పార్టీలు, అనంతరం అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్క అర్హునికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 12:09 PM IST

ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం పట్వారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సత్తుపల్లి ప్రముఖ వైద్యశాలలు శ్రీనిధి హాస్పిటల్ , లైఫ్ కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషమన్నారు.

February 22, 2026 / 12:07 PM IST

కోతుల పెరుగుదలపై గ్రామస్తుల ఆందోళన

VKB: దోమలో కోతులు స్వేచ్ఛగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. స్కూల్‌కు వెళ్తున్న పిల్లలు, రోడ్లపై నడిచే వాహనదారులు కోతుల దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుంపులుగా తిరిగే కోతులు ఇళ్లలోకి చొరబడి నిత్యవసర సరుకులు తీసుకెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికులు అధికారులు వెంటనే స్వైర విహారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 12:03 PM IST