ADB: నెరడిగొండ మండలంలోని దుర్బాతండా గ్రామంలో ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే పార్టీలు, అనంతరం అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్క అర్హునికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
BDK: దమ్మపేట మండలం పట్వారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సత్తుపల్లి ప్రముఖ వైద్యశాలలు శ్రీనిధి హాస్పిటల్ , లైఫ్ కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషమన్నారు.
VKB: దోమలో కోతులు స్వేచ్ఛగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. స్కూల్కు వెళ్తున్న పిల్లలు, రోడ్లపై నడిచే వాహనదారులు కోతుల దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుంపులుగా తిరిగే కోతులు ఇళ్లలోకి చొరబడి నిత్యవసర సరుకులు తీసుకెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికులు అధికారులు వెంటనే స్వైర విహారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.
HNK: రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుచేస్తున్న రైతులతో రాఘవరెడ్డి సమావేశమయ్యారు. రైతులు అధిక దిగుబడులు సాధించడానికి శాస్త్రీయ పద్ధతులు, సమయానుకూల ఎరువుల వినియోగం, నీటి నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు.
RR: మియాపూర్లోని 240వ డివిజన్ పెబుల్స్ బే నుంచి ప్రశాంత్ నగర్ రోడ్డు వరకు ఆదివారం ఉదయం అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజల్లో తడి-పొడి చెత్త వేర్పాటుపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అట్టేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రామప్రభు తెలిపారు.
BHPL: భూపాలపల్లి జిల్లాలో రైతుల సాగు భూముల వివరాలు డిజిటల్ సర్వే చేసేందుకు ప్రభుత్వం వాలంటీర్లను నియమిస్తోంది. రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున 12 మండలాల్లో 186 మందిని నియమించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా వ్యవసాయ అధికారి (DAO) బాబురావు తెలిపారు. భవిష్యత్తులో పంటల నమోదు డిజిటల్ విధానంలో జరుగుతుందని DAO బాబురావు వెల్లడించారు
MHBD: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిపై ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అమీజ్ పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిలు నిస్వార్ధంగా పని చేస్తున్నారని అన్నారు.
KMR: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడలో 163 BNSS (పాత సెక్షన్ 144) అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, ఆయుధాలు ధరించడం నిషేధమని హెచ్చరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, పోలీసు విధి నిర్వహణ, అత్యవసర వైద్య సేవలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు.
భువనగిరి: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు కలెక్టర్ హనుమంతరావు కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఇకపై హెల్మెట్ లేని బైక్లకు పెట్రోల్ పోయకూడదని బంక్ యాజమాన్యాలను ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
వనపర్తి: వీపనగండ్లలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా సర్వే నెంబర్ 721 ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు పార్టీలకతీతంగా నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేసి, హద్దులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
BDK: కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇటీవల ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సామాజిక సేవా నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ సన్మానించారు. కొత్తగూడెం మేయర్గా ఎన్నికైన మూడు గణేష్ను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సీపీఐ పార్టీ తరఫున 50వ డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన దాసరి శీనన్నను కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన కేకేను సత్కరించారు.
హనుమకొండ జిల్లా కాజిపేట మండల కేంద్రలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదివారం సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పధకాలను శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండు సంవత్సరాల తర్వాత చేసిన పనులపై కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ శ్రీ, కార్యకర్తలు పాల్గొన్నారు.
MBNR: జడ్చర్ల మండలంలోని 15 గ్రామాలకు చెందిన నూతన వార్డు సభ్యులకు సోమవారం నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. మొదటి బ్యాచ్ కింద ఆలూరు బూరుగుపల్లి, ఉదండాపూర్, చెర్లపల్లి సహా పలు తండాల ప్రతినిధులకు ఈ శిక్షణ ఉంటుంది. క్షేత్రస్థాయిలో పాలన, అధికారాలపై అవగాహన కల్పించడమే ఈ తరగతుల ముఖ్య ఉద్దేశం హాజరు కావాలని అధికారులు సూచించారు.
NLG: కనగల్ మండలంలోని ధర్వేశిపురం, ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో వీధి కుక్కలు తీవ్రమైన చర్మవ్యాధితో కనిపిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వ్యర్థాల వల్ల సోకిన ఈ వ్యాధి మనుషులకు ప్రబలకుండా పశువైద్య అధికారులు తక్షణమే స్పందించి కుక్కలకు చికిత్స అందించాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
BHPL: రేగొండ మండల కేంద్రానికి చెందిన మైస వీరస్వామి ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రావణ్ సిద్దార్థ్ యూత్ ఇవాళ మృతుడి నివాసానికి వెళ్లి.. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి..రూ.5000 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.