ఆదిలాబాద్: కలెక్టరేట్తో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు చిన్నపాటి సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, మండల కేంద్రాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. డిజిటల్ ఫిర్యాదులకు సమాధానం ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
SRPT: పెన్పహాడ్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. మండల కేంద్రంతో పాటు దుబ్బతండా, పొట్లపహాడ్ గ్రామాలకు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు విద్యుత్కు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
SRPT: తిరుమలగిరి మండలంలోని వెలిశాలలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. లాక్యతండాకు చెందిన నెహ్రూ (30) బైక్పై వెళ్తుండగా, వెలిశాల పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెహ్రూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
NRPT: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో నారాయణపేట అదనపు ఎస్పీ ఎండీ.రియాజ్ హూల్ హక్ విశిష్ట ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. 50 ఏళ్లపై సీనియర్ అధికారుల లాన్ టెన్నిస్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కుని ప్రథమస్థానంలో నిలిచారు.
MHBD: గంగారం మండలం రెడ్యాల గ్రామానికి చెందిన మాజీ TPCC కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, వెన్నం విజయ్ కాంత్ రెడ్డి తండ్రి రాఘవేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
HNK: నడికూడ (M) చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, తెలుగు భాషా ఉపాధ్యాయులు పల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలను అన్నింటిని రక్షించుకోవాలన్నారు. మాతృభాష మృత భాష కాకూడదని అమృత భాష కావాలని కోరారు. ఉపాధ్యాయులు లకావత్ దేవ, రాజకుమార్ ఉన్నారు.
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మహేశ్వరంలో ప్రతి బస్స్ హాల్టింగ్ చేయాలని శనివారం కౌన్సిలర్ మృత్ నాయక్, శిరీష రాజు RTC డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వెళ్లే ప్రజలు బస్సు ఆపకపోవడంతో నర్సంపేటకు రావాల్సి వస్తుందని తెలిపారు. అధికారులు స్పందించి బస్సు హాల్టింగ్ చేయాలని కోరారు.
ADB: బజార్హత్నూర్ మండలానికి చెందిన బుకి సుమిత్ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సుమిత్ ను శనివారం పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2.5 లక్షల ఎల్వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
PDPL: రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన మల్యాల రాధమ్మ మృతి అనంతరం కుటుంబ సభ్యులు నేత్రదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ ఆధ్వర్యంలో సదాశయ ఫౌండేషన్ సహకారంతో ల్యాబ్ టెక్నీషియన్ ప్రదీప్ నేత్రాలను సేకరించారు. కుమారులు శ్రీనివాస్, గణపతి, రాంశంకర్, కృష్ణమూర్తి తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.
ములుగు జిల్లా కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టును ఆదివారం CM రేవంత్ రెడ్డి పరిశీలించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్, దేవాదుల పంప్ హౌస్ వద్ద ఏర్పాట్లను అదనపు కలెక్టర్ మహేందర్ జీ, RDO వెంకటేష్ పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను BHPL SP సంకీర్త్ గౌడ్, ఏటూరునాగారం ASP మనన్ భట్ పరవేక్షిస్తున్నారు.
SRD: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతతతో పాటు జీవితానికి దిశానిర్దేశం ఇస్తాయని మాజీ ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం నాగలిగిద్ద మండలం ఔదత్ పూర్లోని శ్రీ ఎల్లా లింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించారు. ఇక్కడ జాతర మహోత్సవాల్లో మచ్చేందర్ నాథ్ మహారాజ్ను కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.
SDPT: ప్రభుత్వ పథకాలకు రాయతీలు లభించాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి సరూప రాణి అన్నారు. జిల్లా పరిధిలోని రైతులు తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా, మీసేవ కేంద్రాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే పంట బీమా, సబ్సిడీలు అందుతాయన్నారు.
GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ పెద్ద మసీద్ మక్బుల్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మౌలానా రజాక్ సర్వ మానవాళి సుఖసంతోషాలతో, శాంతియుతంగా జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరై ఉపవాస దీక్షలను విరమించారు.
NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ క్యాన్సర్ చికిత్స పొందుతూ మరణించారు. శనివారం రాష్ట్ర పశుసంవర్థక, క్రీడా, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నారాయణ భౌతికకాయానికి పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో మంత్రి పాల్గొని చనిపోయిన కార్యకర్త లక్ష్మీనారాయణ పాడెను మోశారు.
RR: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండకి చెందిన అశోక్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2,50,000 మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నర్నె శ్రీనివాస్ రావుతో కలిసి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అందజేశారు.