• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వైద్య శిబిరాన్ని పరిశీలించిన DMHO

NGKL: కల్వకుర్తి మండలంలోని తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ రవికుమార్ పరిశీలించారు. ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. దాదాపు 200 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని ఆయన తెలిపారు.

March 14, 2026 / 04:02 PM IST

రబీ పంటకు కేఎస్ఐ నీరు: ఎమ్మెల్యే

NGKL: నియోజకవర్గ రైతులకు రబీ పంట పండేంతవరకు వాటర్ విడుదల చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. రైతులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రేపటి నుంచి కంటిన్యూగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పంటలు పూర్తిగా పండే వరకు నీళ్లు వదలాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

March 14, 2026 / 04:01 PM IST

‘ప్రజలు పన్నులు చెల్లిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి’

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తూ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య కోరారు. 55వ డివిజన్‌లో నిర్వహించిన ‘శుభ్రత – ప్రతి ఒక్కరి బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు సక్రమంగా జరగాలంటే ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.

March 14, 2026 / 04:00 PM IST

గుండ్ల సింగారంలో కారల్ మార్క్స్ వర్ధంతి

HNK: నగరంలోని గుండ్ల సింగారం కారల్ మార్క్స్ 143వ వర్ధంతిని సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీపీఐ మండల కార్యదర్శి స్టాలిన్ మాట్లాడుతూ.. శ్రమ విలువను గుర్తించి పెట్టుబడిదారీ శ్రమ దోపిడీ వ్యవస్థ యొక్క కుట్రలను ఎత్తిచూపి ప్రపంచ గమనాన్ని మార్చిన సిద్ధాంతం మార్క్సిజమని, ఆ సిద్ధాంత రూపకర్త కారల్ మార్క్స్ అని అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

March 14, 2026 / 04:00 PM IST

‘రైతులకు సాగునీరు అందించే బాధ్యత నాది’

JN: వచ్చే వర్షాకాలం వరకు కాలువ లైనింగ్ పనులు పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు నీరు అందించే బాధ్యత తనదాని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జఫర్‌గడ్ మండలంలోని తీగారం, హిమ్మత్ నగర్ గ్రామాల మధ్య కాలువను పరిశీలించారు. కాలువ వెంట క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

March 14, 2026 / 03:59 PM IST

పాతబస్తీ యువత బీజేపీలో చేరిక

HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాత బస్తీకి చెందిన యువత పెద్ద ఎత్తున BJPలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అభివృద్ధి పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు, పాతబస్తీ అభివృద్ధికి నవభారత నిర్మాణానికి బీజేపీతో కలిసి నడుస్తామని యువత పేర్కొన్నారు.

March 14, 2026 / 03:58 PM IST

‘జిల్లా వ్యాప్తంగా 37 మంది గైర్హాజరు’

NLG: జిల్లాలోని 106 పరీక్ష కేంద్రాల్లో పదవ తరగతి తెలుగు పరీక్ష సుజావుగా జరిగినట్లు డీఈవో బిక్షపతి తెలిపారు. మొత్తం 19,672 మంది విద్యార్థులకు గాను 19,635 మంది విద్యార్థులు పరీక్ష వ్రాసినట్లు తెలిపారు. 37 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నాలుగు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారని పేర్కొన్నారు.

March 14, 2026 / 03:56 PM IST

కుషాయిగూడ డిపో నుంచి కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు

MDCL: TSRTC కుషాయిగూడ డిపో నుంచి కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. ఈ బస్సు మార్చి 28 సాయంత్రం 6 గంటలకు ఈసీఐఎల్ బస్టాండ్ నుంచి బయలుదేరి ఉజ్జయిని, ఓంకారేశ్వర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, కాశీ క్షేత్రాలను సందర్శిస్తుందన్నారు. టికెట్ ధర రూ. 8,000 ఉందని తెలిపారు. బుకింగ్ కోసం 9959226145, 9603549388 సంప్రదించాలి పేర్కొన్నారు.

March 14, 2026 / 03:56 PM IST

లింగమూర్తి చొరవతో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు

HNK: కేయూ మాజీ VC లింగమూర్తి ఇవాళ అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో ఆయన కేయూ అభివృద్ధికి చేసిన సేవను పలువురు గర్తు చేసుకుంటున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో 2009 అప్పటి CM YSR దృష్టికి తీసుకెళ్లి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారు. ప్రస్తుతం 6 బీటెక్ కోర్సుల్లో 360 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.

March 14, 2026 / 03:54 PM IST

కేంద్ర మంత్రికి వైద్య పరీక్షలు

KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర మండుటెండలోనూ ఉత్సాహంగా సాగుతోంది. గంగాధర మండలం సమీపంలో యాత్ర కొనసాగుతుండగా, వైద్య బృందం ఆయనకు రొటీన్ హెల్త్ చెకప్ నిర్వహించింది. ఎండ తీవ్రత దృష్ట్యా మంత్రి ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్యులు, తగు సూచనలు చేశారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించారు.

March 14, 2026 / 03:48 PM IST

ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నపం

NZB: ఉపాధ్యా యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ TPUS ఉపాధ్యాయ సంఘం నేతలు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి శనివారం వినతి పత్రం అందజేశారు. నూతన PRC అమలు, పెండింగ్‌లో ఉన్న DAల విడుదల, పెన్షన్ సౌకర్యాలు వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని MLA హామీ ఇచ్చారు.

March 14, 2026 / 03:48 PM IST

యువతకు మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ప్రారంభం

PDPL: పెద్దపల్లి జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెడికల్ కోడింగ్&బిల్లింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఈ శిక్షణ మార్చి 16 నుంచి పెద్దపల్లి TASK రీజినల్ సెంటర్‌లో ప్రారంభంకానుందని, ఫార్మసీ, బయోటెక్నాలజీ విద్యార్థులు నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

March 14, 2026 / 03:47 PM IST

పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు పరిశీలన

KMM: జిల్లాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును శనివారం ADCP ప్రసాదరావు పరిశీలించారు. నగరంలోని శాంతినగర్ ప్రభుత్వ పాఠశాల, మోంట్ ఫోర్ట్ స్కూల్, రాజేంద్రనగర్, నయాబజార్ పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. కమిషనరేట్ పరిధిలోని 98 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా సాగేలా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

March 14, 2026 / 03:46 PM IST

TRP నాయకుడిని పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు

BHPL పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జిల్లా నాయకులు అంబాల నరసయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న TRP జిల్లా అధ్యక్షుడు రవిపటేల్ శనివారం వారి నివాసానికి వెళ్లి ఆయన పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

March 14, 2026 / 03:45 PM IST

నార్నూరులో పర్యటించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ADB: నార్నూర్ మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్బంగా మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ కావేరితో పలు సమస్యలపై చర్చించారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాన్సన్ నాయక్, శ్రీరామ్ నాయక్, ఉత్తమ్ రాథోడ్, బానోత్ గజానంద్, దాదేఅలీ, తిరుమల గౌడ్, సయ్యద్ కాసిం, కొర్రల మహేందర్ పాల్గొన్నారు.

March 14, 2026 / 03:42 PM IST