MBNR: నవంబర్ చివరి నాటికి ఉదండాపూర్ భూ నిర్వాసితులకు ప్లాట్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పునరావాసం కింద నిర్వాసితులకు 300 గజాల ప్లాటు, ఆ ప్రాంతంలో ఆసుపత్రి పాఠశాల సీసీ రోడ్ సౌకర్యాలు కల్పించాలన్నారు.
MDK: మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామ్మోహన్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి పార్టీల నాయకులకు అవగాహన కల్పించారు. ఎన్నికల నియమ, నిబంధనల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రహీం, జోనల్ ఆఫీసర్స్ రామకృష్ణ, వరదరాజులు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఎఎస్సై సదాశివరావు తదితరులు ఉన్నారు.
BHPL: రేగొండ పెద్దపల్లి గ్రామానికి చెందిన నవీండ్ల శంకర్ పక్షవాతంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. అదే గ్రామానికి చెందిన హోంగార్డు దాట్ల ఐలయ్య, శంకర్ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితులు ఆరోపించారు. శంకర్ కుటుంబం అడిగినా ఐలయ్య బెదిరిస్తున్నాడని వాపోయారు. సమస్య పై MLA గండ్ర స్పందించి హోంగార్డ్ పై చర్యలు తీసుకోవాలని ఇవాళ కోరారు.
WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామ SC కాలనీలో గత ఏడాదిగా వీధిదీపాలు లేక కాలనీవాసులు రాత్రివేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం లేకపోవడం, నిధుల కొరతతో అధికారులు స్పందించలేదు. ఈ సమస్యను గమనించిన జిల్లా ప్రవీణ్, వేల్పుగొండ ప్రవీణ్, నక్క వెంకటేశ్, శశి కుమార్ అనే యువకులు మంగళవారం స్వచ్ఛందంగా వీధిదీపాలు అమర్చారు.
KNR: 2024 మార్చి నుంచి పదవీ విరమణచేసిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని,రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లాశాఖ డిమాండ్ చేసింది. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఉమ్మడి జిల్లా శాఖల ప్రతినిధులు, సభ్యులతో కలిసి మహాధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర నుంచి ఇప్పటివరకు ప్రయోజనాలు అందలేదన్నారు.
KMR: జిల్లా నుంచి పలువురు నాయకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో మంగళవారం తెలంగాణ జాగృతిలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఎస్పీ(BSP) తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన సురేష్ గౌడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి తలారి బాలరాజులు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు.
MLG: మంగపేట మండల కేంద్రంలోని కమలాపురం గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జయరాం రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికి అధిష్టానం టికెట్ కేటాయించిన వారి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు చేపడతామని హెచ్చరించారు.
KNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు,ఎన్నికల ప్రక్రియనిర్వహణపై ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
KMR: త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్ మంగళవారం హాజీపూర్ పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన గ్రామ కార్యదర్శికి సూచించారు. వికలాంగుల కోసం ర్యాంపులు, మంచినీటి వసతి, వరుస క్రమం (క్యూ లైన్) ఏర్పాటు చేయాలని ఎంపీడీవో ఆదేశించారు.
KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను వివరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు నియోజకవర్గ అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
BDK: జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికలకు సంబంధించి వివిధ ప్రచార సామగ్రికి ఖర్చు పరిమితులను నిర్ణయిస్తూ రేట్ చార్ట్ విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు జిల్లా ప్రాజా పరిషత్ ద్వారా అన్ని MPDOలు, ZPTC, MPTC రిటర్నింగ్ అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులకు పంపిణీ చేయబడ్డాయి.
ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని మడూర్ కాంప్లెక్స్ హెచ్ఎం రవిందర్ రెడ్డి సూచించారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలం మడూర్ జడ్పీ పాఠశాలలో కాంప్లెక్స్ ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన భోధనకు ఉపాధ్యాయులు కృషిచేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కనీస సామర్థ్యాలు పరిశీలించాలన్నారు.
NZB: జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో సైబర్ మోసల పట్ల విద్యార్థులకు డిచ్పల్లి సీఐ వినోద్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ దోషాలు కుదిరితే ఉంటుంది 1930 సంప్రదించాలన్నారు. సైబర్ మోసాలలొ గోల్డెన్ అవర్ ముఖ్యమైనదని తెలియజేశారు. ఎవరైనా సైబర్ నేరాల ఉచ్చులో పడ్డట్లయితే వారు 1930 ద్వారా సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయవచ్చని అన్నారు.
KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో జన్నారం మండలంలో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మండలంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారిని గులాబీ జెండా కప్పి పార్టీలోని ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయింది అన్నారు.
BHNG: జిల్లాలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు మంగళవారం ప్రారంభమైన సందర్భంగా జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ కోనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిశీలించారు. తరగతి గదిలో కూర్చొని విద్యార్థులతో పాటు పదవ తరగతి గణిత పాఠాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుడి బోధనను పరిశీలించారు.