PDPL: గోదావరిఖని మేదరి బస్తీకి చెందిన పిల్లి కుమార్ అనే వ్యక్తి, ఇంటి పైకప్పుకు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ ఎలాంటి పని చేయకపోగా, కొద్ది రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. భార్య రజిత కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుందని వెల్లడించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
BDK: చర్ల మండలం ఎంపీడీవో కార్యాలయం శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని 45 కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏన్నో మధ్యతరగతి కుటుంబాలకు కల్యాణ లక్ష్మి అండగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల పాల్గొన్నారు.
KNR: డాక్టర్ బి.యన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యో గుల సమస్యలపై సదస్సు ఈరోజు ఫిలిం భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను ప్రభుత్వం పెంచాలని సూచించారు.
KMM: తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వారంరోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామానికి చెందిన మెట్టు వెంకన్న (55), ఆయన భార్య రాధ (50) గుండెపోటుతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
WGL: గాంజాయి మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. మత్తుకు బానిసైన యువకుడు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభునిపేటలో బీభత్సం సృష్టించాడు. మత్తు పదార్థాలు తమ ఇంటి ప్రాంతంలో సేవించవద్దని చెప్పిన వారిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
MLG: పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఒజ్జల లింగయ్య కుమార్తె వివాహా మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోతు రవి చందర్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
NGKL: కల్వకుర్తి మండలంలోని తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ రవికుమార్ పరిశీలించారు. ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. దాదాపు 200 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని ఆయన తెలిపారు.
NGKL: నియోజకవర్గ రైతులకు రబీ పంట పండేంతవరకు వాటర్ విడుదల చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. రైతులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రేపటి నుంచి కంటిన్యూగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పంటలు పూర్తిగా పండే వరకు నీళ్లు వదలాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తూ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య కోరారు. 55వ డివిజన్లో నిర్వహించిన ‘శుభ్రత – ప్రతి ఒక్కరి బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు సక్రమంగా జరగాలంటే ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.
HNK: నగరంలోని గుండ్ల సింగారం కారల్ మార్క్స్ 143వ వర్ధంతిని సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీపీఐ మండల కార్యదర్శి స్టాలిన్ మాట్లాడుతూ.. శ్రమ విలువను గుర్తించి పెట్టుబడిదారీ శ్రమ దోపిడీ వ్యవస్థ యొక్క కుట్రలను ఎత్తిచూపి ప్రపంచ గమనాన్ని మార్చిన సిద్ధాంతం మార్క్సిజమని, ఆ సిద్ధాంత రూపకర్త కారల్ మార్క్స్ అని అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
JN: వచ్చే వర్షాకాలం వరకు కాలువ లైనింగ్ పనులు పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు నీరు అందించే బాధ్యత తనదాని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జఫర్గడ్ మండలంలోని తీగారం, హిమ్మత్ నగర్ గ్రామాల మధ్య కాలువను పరిశీలించారు. కాలువ వెంట క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాత బస్తీకి చెందిన యువత పెద్ద ఎత్తున BJPలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అభివృద్ధి పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు, పాతబస్తీ అభివృద్ధికి నవభారత నిర్మాణానికి బీజేపీతో కలిసి నడుస్తామని యువత పేర్కొన్నారు.
NLG: జిల్లాలోని 106 పరీక్ష కేంద్రాల్లో పదవ తరగతి తెలుగు పరీక్ష సుజావుగా జరిగినట్లు డీఈవో బిక్షపతి తెలిపారు. మొత్తం 19,672 మంది విద్యార్థులకు గాను 19,635 మంది విద్యార్థులు పరీక్ష వ్రాసినట్లు తెలిపారు. 37 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నాలుగు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారని పేర్కొన్నారు.
MDCL: TSRTC కుషాయిగూడ డిపో నుంచి కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. ఈ బస్సు మార్చి 28 సాయంత్రం 6 గంటలకు ఈసీఐఎల్ బస్టాండ్ నుంచి బయలుదేరి ఉజ్జయిని, ఓంకారేశ్వర్, అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ క్షేత్రాలను సందర్శిస్తుందన్నారు. టికెట్ ధర రూ. 8,000 ఉందని తెలిపారు. బుకింగ్ కోసం 9959226145, 9603549388 సంప్రదించాలి పేర్కొన్నారు.
HNK: కేయూ మాజీ VC లింగమూర్తి ఇవాళ అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో ఆయన కేయూ అభివృద్ధికి చేసిన సేవను పలువురు గర్తు చేసుకుంటున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో 2009 అప్పటి CM YSR దృష్టికి తీసుకెళ్లి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారు. ప్రస్తుతం 6 బీటెక్ కోర్సుల్లో 360 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.