BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకపురంలో గ్రామానికి చెందిన రైతు అంబటి సాంబయ్య ఎద్దు విద్యుత్ షాక్కు గురై చనిపోయింది. తన వ్యవసాయ పొలం వద్ద ఎద్దులను మేత మేయిస్తుండగా విద్యుత్ షాక్తో ఎద్దు మృతి చెందింది. సుమారు లక్షా ఇరవై వేల రూపాయల విలువ గల ఎద్దు మృతి చెందడంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు.