• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మర్రి చెన్నారెడ్డికి బీజేపీ నేతల నివాళి

నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను సంజయ్ కొనియాడారు. తొలి తెలంగాణ ఉద్యమ నేత మర్రి చెన్నారెడ్డి అంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ లో వేలకోట్ల నిజాం అక్రమ ఆస్తులను, స్థలాలను కబ్జా కాకుండా అడ్డుకొని తెలిపారు. అవీ ప్రజలకు ఉపయోగపడేలా చేశారని గుర్తుచేశారు. 1969లో తెలం...

January 13, 2023 / 05:16 PM IST

ఊపు మీదున్న బాలయ్య.. హాఫ్ సెంచరీ కొట్టిన వీరసింహారెడ్డి

థియేటర్లో వీరసింహారెడ్డి ఊచకోతకు.. రికార్డులు బద్దలవుతున్నాయి.  అఖండ బ్లాక్ బస్టర్‌.. అన్ స్టాపబుల్ టాక్ షో.. బాలయ్య క్రేజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఇలాంటి సమయంలో క్రాక్ బ్లాక్ బస్టర్‌తో జోష్ మీదున్న గోపీచంద్ మలినేని.. బాలయ్యతో వీరసింహారెడ్డి తెరకెక్కించాడు. దానికి తోడు మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడం.. సినిమా పై భారీ హైప్ తీసుకొచ్చింది. అందుకు తగ్గట్టే బాలయ...

January 13, 2023 / 04:38 PM IST

పొంగులేటి దెబ్బ, తుమ్మలకు కేసీఆర్ బుజ్జగింపు..!!

ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చల్లబడ్డారా.. అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. కొత్తగూడెం పర్యటనలో తుమ్మల మొదటి నుండి చివరి వరకు అధినేత కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆయనను సీఎం ఆత్మీయంగా పలకరించారు. కలెక్ట...

January 13, 2023 / 12:12 PM IST

పంచాయతీలు, మున్సిపాలిటీలకు భారీగా నిధులు.. మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రకటన

మహబాబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ నిధుల వరద పారించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ఇవాళ ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై మాట్లాడారు. మహబూబాబాద్, తిరుమలగిరి, వర్ధన్నపేట ప్రాంతాల్లో గతంలో పూర్తికాని కాలువలను చూసి మనసు చలించేందని గుర్తుచేసుకున్నారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో వెలుగు నిండాలనే ఉద్దేశంతో జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ ...

January 12, 2023 / 07:08 PM IST

కేసీఆర్‌ను కలిసిన జనసేన పార్టీ సలహాదారు రామ్మోహన్

తమిళనాడు మాజీ సీఎస్, జనసేన సలహాదారు ఆర్ రామ్మోహన్ బుధవారం నాడు ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాపు నేత. ఇటీవలే తోట చంద్రశేఖర్ తదితర కాపు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరో కాపు నేత కేసీఆర్ ని కలవడం చర్చకు దారి తీసింది. ఈ భేటీ సమయంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు కాపు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నేత పార్థసారథి [&hel...

January 12, 2023 / 06:47 PM IST

పొంగులేటి బీజేపీ వైపు చూస్తున్నాడా?

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారని వార్తలు వేగం పుంజుకున్నాయి. త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో పొంగులేటి పార్టీలోంచి బయటకు రావడం బీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ. అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలల గడువు ఉంది. ఈ సమయంలో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. 18వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ భారీ సభను కూడా ప్లాన్ చేసింది. అదే సమయంలో పొంగులేటి కమలం తీర్థం పుచ్...

January 12, 2023 / 05:47 PM IST

షోకాజ్ నోటీసులు చెత్తబుటలో పడేశా.. ఓడిపోయినోళ్లతో కలిసి కూర్చోవాలా?

మునుగోడు ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద ఆ పార్టీ అధిష్టానం కోపంగా ఉంది. మునుగోడులో ప్రచారానికి రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ గెలవదని కామెంట్లు చేయడం, దీనికి తోడు.. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని  గెలిపించమని ఫోన్లలో మాట్లాడటం వంటి చర్యల పట్ల పార్టీ అధిష్టానం వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే..తాజాగా తెలంగాణ కా...

January 12, 2023 / 03:54 PM IST

వీఆర్ఎస్‌పై క్లారిటీ ఇచ్చిన సోమేష్ కుమార్

తెలంగాణలో కొత్త సీఎస్ గా శాంతికుమారి విధుల్లో చేరడంతో.. ఈ పదవిలో ఉన్న సోమేష్ కుమార్ రిలీవ్ అయ్యారు. ఆయన గురువారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో సోమేష్  కుమార్ విజయవాడకు వచ్చారు. తనను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఆదేశాలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఇం...

January 12, 2023 / 02:17 PM IST

హరీశ్ రావును ఢిల్లీకి పంపేందుకే బీఆర్ఎస్: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

బీఆర్ఎస్ పార్టీని క్రమంగా సీఎం కేసీఆర్ విస్తరిస్తూ వస్తున్నారు. ఏపీకే కాదు తెలంగాణకు కూడా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో తొలి బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు.  సీఎంలు, మాజీ సీఎంలు తరలి వస్తున్నారు. ప్లాన్డ్ ప్రకారం కేసీఆర్ వెళుతున్నారు. ఆ పార్టీపై బీజేపీ మాత్రం విమర్శలు చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్ట...

January 11, 2023 / 09:50 PM IST

కేటీఆర్ రాయబారం ఫెయిల్? పొంగులేటి ఏ పార్టీలోకి?

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేశంతో ఉగిపోలేదు… ఎక్కడా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు తీయలేదు…! కానీ సూటిగా మాత్రం వారికి చెప్పాల్సింది చెప్పేశారు… కేటీఆర్ పేరు ఓసారి తీసినప్పటికీ… ఆయనతో ఉన్న మంచి ఫ్రెండ్‌షిప్ కారణంగానే ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీలో కొనసాగినట్లు చెప్పారు. అధికార మదం, అధికార గర్వం, ఆవేదన చెందితే టార్గెట్ చేస్తారా, పదవి ...

January 11, 2023 / 09:46 PM IST

కేసీఆర్.. ఖమ్మం ప్రజలకు సారీ చెప్పు, ఆ తర్వాతే అడుగుపెట్టు: రేణుకా చౌదరీ

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఫైరయ్యారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మం నూతన కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీంతో పొలిటికల్ హీట్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడే రియాక్షన్స్ మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ లక్ష్యంగా రేణుకా చౌదరి విమర్శలు స్టార్ట్ చేశారు. ఖమ్మంలో అడుగుపెట్టే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదని చెప్పా...

January 11, 2023 / 09:41 PM IST

కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి లకు మంత్రి ఎర్రబెల్లి ఛాలెంజ్…!

కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు  తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఛాలెంజ్ విసిరారు. తమ తెలంగాణలో జరిగినంత అభివృద్ధి.. కాంగ్రెస్, బీజేపీ లు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా జరిగిందో లేదో చూపిస్తే… తాను రాజీనామాకు సిద్ధమని ఆయన ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ కంటే ఛత్తీస్గడ్, కర్ణాటకలో మెరుగైన సేవలు అందిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అవస...

January 11, 2023 / 09:09 PM IST

వార్‌రూమ్ కేసులో నిందితుడిగా మల్లు రవి

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చారు. అంతకుముందు వార్ రూమ్ తన పర్యవేక్షణలోనే కొనసాగేదని.. తనకు నోటీసులు ఇవ్వకుండా సునీల్ కనుగోలును విచారించడం ఏంటీ అని మాట్లాడారు. సునీల్ విచారణ, అందులో ఆయన చెప్పిన అంశాల ఆధారంగా మల్లు రవిని నిందితుడిగా చేర్చారు. ఆ వెంటనే మల్లు రవి మాట మార్చేశారు. తనకేం తెలియదని నమ్మబలికే...

January 11, 2023 / 09:13 PM IST

డీజే టిల్లుతో మంత్రి మల్లన్న స్టెప్పులు, హోరెత్తిన కాలేజీ ప్రాంగణం

సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కైట్ ఫెస్టివల్. ఇక సిటీలో అయితే మాములుగా ఉండదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. ఇప్పుడు కాలేజీల్లో కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి చెందిన యూనివర్సిటీలో కూడా కైట్ ఫెస్టివల్ ఇవాళ (బుధవారం) జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల మైసమ్మగూడలో కైట్ రంగోలి నిర్వహించారు. వేడుకకు డీజే టిల్లు ఫేమ్, హీరో సిద్దు జొన్న...

January 11, 2023 / 09:13 PM IST

తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులు అయ్యారు. సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ కొత్త సీఎస్‌ను ఎంపిక చేశారు. రేసులో రామకృష్ణారావు, అరవింద్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం శాంతికుమారి వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది. ఆమె నియామకానికి సంబంధించి ఉత్తర్వులు రావడమే మిగిలి...

January 11, 2023 / 07:43 PM IST