ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్(MLC Kavitha husband Anil) అరెస్ట్ అవుతారా లేదా అనే విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రభుత్వం ప్రొటోకాల్లను పాటించడం లేదని, గవర్నర్ రాజ్యాంగబద్ధమైన కార్యాలయాన్ని గౌరవించడం లేదని సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు సచివాలయం, అంబేద్కర్ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని వెల్లడించారు.
కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. కల్తీ వ్యాపారం చేస్తూ దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు. చిన్న పిల్లలు తాగే పాలనుంచి ప్రతీ వస్తువును కల్తీ చేస్తున్నారు.
దేశంలోని దాదాపు అన్ని ఎయిర్ పోర్టులు(Airports) అక్రమ రవాణాకు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం(Gold), డ్రగ్స్(Drugs) వంటి వాటిని విదేశాల్లో తెచ్చి మన దేశంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో బంగారం ధరలు(Gold Proc) చుక్కలను అంటుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లాకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్(Nalla Vijay) రెండు గ్రాముల బంగారంతో చీర(Gold Saree)ను నేసి అమ్మవారికి కానుకగా ఇచ్చాడు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ చీర అగ్గిపెట్టె(Match Boxలో ఇమిడేలా తయారు చేశాడు.
ప్రజా గాయకుడు గద్దర్(singer gaddar) ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్(CM KCR)పై తాను గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మరి ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మధ్యాహ్నం సమావేశం ప్రారంభం కాకుండానే బీజేపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న సమావేశాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన (Protest) చేశారు. ఈ క్రమంలో అధికారులను ఉద్దేశించి ‘సిగ్గుందా’ అంటూ బీజేపీ కార్పొరేటర్లు దూషించారు.
మాల్స్ యాజమాన్యాలు ఇప్పటివరకు చేసిన ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాగ్ షీట్స్, ఆడిటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు. సంస్థ ఫైనాన్స్ మేనేజర్లను అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ తనిఖీల నేపథ్యంలో షాపింగ్ మాల్స్ లో వినియోగదారులను అనుమతించడం లేదు.
జూపార్క్ సందర్శన టికెట్ ధరలు పెంచేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. సెలవు రోజుల్లో పెద్దలకు రూ.80, సాధారణ రోజుల్లో రూ.70, ఇక పిల్లలకు సాధారణ రోజుల్లో రూ.45, సెలవుల్లో రూ.55 ధరలు పెంచాలని నిర్ణయించింది.
ఇక తానే స్థానిక నాయకుడినని ఎమ్మెల్యే చెప్పారు. ‘ఇక్కడే పుట్టా. ఇక్కడే చస్తా.. చచ్చాక తాండూరులోనే బొంద పెట్టండి’ అంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాండూరు ఎమ్మెల్యే టికెట్ తనదేనని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.