సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాల్లో షేర్ చేశారంటూ డిసెంబరులో ముగ్గురు కాంగ్రెస్ వార్ రూమ్ వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ సీనియర్ నేత మల్లురవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం హైకోర్టు.. పలువురు నేతలను అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
హుజూరాబాద్ సభలో కేసీఆర్ను ఉద్దేశించి ప్రసంగించిన ఈటల రాజేందర్...ఏ జాతీయ పార్టీ ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇవ్వనప్పుడు బీజేపీ పార్టీ ముందుకొచ్చిందని అన్నారు. 2009లోనే ప్రధాని మోడీ తెలంగాణకు సపోర్ట్ చేశాడన్నారు. తెలంగాణ చిన్నమ్మగా పిలువబడిన సుష్మాస్వరాజ్ సేవలను గుర్తుచేశారు. కేసీఆర్ను ఆనాడే ఎదిరించినట్లు ఈటల వెల్లడించారు.
వాతావరణ కాలుష్యం కారణంగా భూతాపం పెరిగిపోతుంది. మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే భారత్తో పాటు తూర్పు పాకిస్థాన్ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని తాజాగా ఒక నివేదిక హెచ్చరించింది.
తెలంగాణలో ఎన్నికల ప్రచారాలకు రంగం సిద్ధమైంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరూ 3 రోజుల పాటు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన హామీలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని.. రాష్ట్ర రెవిన్యూలో 20 శాతం వడ్డీలకే పోతుందన్నారు.
హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకునేవారంతా తమ తమ ఊళ్ళకు పయనమవుతున్నారు. ఎన్నికలు రావడం, పోటీ పరీక్షలు వాయిదా పడటంతో చాలా మంది ఇప్పటికే కోచింగ్ సెంటర్లను ఖాళీ చేసేశారు.
మేడ్చల్ మల్కాజిగిరిజిల్లాలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధమవుతున్నారు.
చంద్రబాబు అరెస్ట్ వెనక వైసీపీ, బీజేపీ ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తనకు వ్యక్తిగతంగా చంద్రబాబు అంటే అభిమానం అని చెప్పుకొచ్చారు.
2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఓ గిఫ్ట్ పంపించారు. గులాబీ రంగులో ఉన్న విలాసవంతమైన ఎన్నికల ప్రచార రథాన్ని హైదరాబాద్ కు కేసీఆర్ కోసం పంపించారు. ఇది చూసిన పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
అధికార బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ బాలాసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు
ఎన్నికల వేళ తెలంగాణలో కోట్ల కొద్ది డబ్బు దొరుకుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల అయింది
సంక్షేమ పథకాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. మేనిఫెస్టోలో ఆ అంశాలను అధినేత కేసీఆర్ పొందుపరిచే అవకాశం ఉంది.
రాష్ట్రంలో లక్షలమంది విద్యార్థులు, ఉద్యోగార్థుల జీవితాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే కేసీఆర్ ను గద్దె దింపాలని అన్నారు.
ప్రవళిక ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రేమించిన శివరామ్కు మరొకరితో నిశ్చితార్థం జరిగిందని.. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని స్పష్టం చేశారు.