సీఎం కేసీఆర్ తాజా ఫొటో బయటకు రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ నియోజకవర్గం నుంచే తాను కూడా పోటీ చేయనున్నట్లు బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రకటించారు. అటు హుజూరాబాద్తో పాటు గజ్వేల్ నుంచి రెండు ప్రాంతాల్లో తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు గట్టి నిఘా ఉంచారు. అయినప్పటికీ మూడు రోజుల్లోనే రూ.10 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. మరో 8 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
పాలేరు నుంచి బరిలోకి దిగుతానని వైఎస్ షర్మిల ప్రకటించారు. బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ విజయమ్మ కూడా పోటీ చేస్తారని హింట్ ఇచ్చారు.
యూట్యూబర్ అనిల్తో కలిసి గంగవ్వ హైదరాబాద్ వచ్చింది. కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయాన్ని ఆశ్చర్యపోయింది. వైరల్ అవుతున్న వీడియోను బీఆర్ఎస్ నేత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఓ కానిస్టేబుల్ తన అత్తమామల విషయంలో కొనసాగుతున్న ఆర్థిక లావాదేవీల విషయంలో కోపుద్రిక్తుడయ్యాడు. ఆ క్రమంలో ఏకంగా తన అత్తపై రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృత్యువాత చెందింది.
ఆరు నెలల కిందట వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెన్షన్కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాగా..రాజాసింగ్ పోటీపై రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్లో ట్రాఫిక్ జాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రధాన రోడ్లపై ఏదైనా కార్యక్రమాలు లేదా మరమ్మత్తు పనులు జరిగితే ఆయా ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అడిక్మెట్ ROB మరమ్మత్తు పనులు జరుగుతున్న క్రమంలో 30 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ప్రత్యర్థుల కామెంట్లకు ప్రధాన పార్టీలు దీటుగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు.
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే పీఏపై అటెంప్డ్ మర్డర్ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలు, ఫోటోలు ద్వారా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈనెల 28న నిర్వహించాల్సిన ఎన్నికలు డిసెంబర్ నెలకు పోస్ట్ పోన్ అయ్యాయి. అయితే ఎందుకనేది ఇప్పుడు చుద్దాం.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు బతుకమ్మ. భాద్రపదం మాసం ప్రారంభంతో పండగ అంబరాన్ని అంటుతోంది. అప్పుడే సింగపూర్లో ఉండే తెలుగు ప్రజలు పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం, నగదు అక్రమ రవాణాపై అధికారులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై కూడా నిఘా ఉంచామని, ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష ఉంటుందని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన ఆదిలాబాద్ జనగర్జన సభలో బండి సంజయ్ రెచ్చిపోయారు. కేసీఆర్కు ఏం జరిగిందని, ఎందుకు బయటకు కనిపించడం లేదని, కేటీఆర్పై అనుమానం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్కు భద్రత పెంచాలని అన్నారు. అయితే ప్రస్తుతం సంజయ్ వ్యాఖ్యలు కేసీఆర్ గురించి కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.