తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పరిధిలో ఓ లారీ నిండా చీరలు తీసుకెళ్తుండగా పట్టుబడ్డాయి.
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఇలా జరగడం పట్ల కావాలనే చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మద్దిపెల్లి సుధీర్ రెడ్డి పార్టీని వీడనున్నారు. అతను కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.
ఫైర్ బ్రాండ్ రాములమ్మ విజయ శాంతి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్పై తనతోపాటు బండి సంజయ్ బరిలోకి దిగుతామని హింట్ ఇచ్చారు.
ధర్మపురి అర్వింద్ తనపై చేసిన వ్యాఖ్యలను మీ ఇంట్లో వారిపై చేస్తే భరించగలరా అని తెలంగాణ ప్రజలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడిగారు. ఉమ్మడి రాష్ట్రంలో.. ఆంధ్ర పాలకులపై ఇలాంటి భాష ఉపయోగించలేదని చెప్పారు.
ములుగు జిల్లాకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు.
మేనల్లుడు హరీశ్ రావుపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఏ పథకం అయినా సరే సిద్దిపేటలో తప్పకుండా అమలు కావాల్సిందేనని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ పదవీ కోరుకోవడం లేదని.. పదవులే తన వద్దకు వస్తాయన్నారు.
ప్రవళిక ఆత్మహత్యకు శివరామ్ కారణమని ఆమె తల్లి విజయ అంటున్నారు. అతనికి ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
తెలంగాణ ఎన్నికల వేళ బీఎస్పీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 10 అద్భుతమైన పథకాలతో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కేవలం వారం రోజుల్లోనే అక్రమంగా సరఫరా చేసిన నగదు, బంగారం, వెండి, మద్యం, గంజాయి తదితర వస్తువులను అధికారులు సీజ్ చేశారు.
తెలంగాణ జనసమితి (TJS) అధ్యక్షుడు కోదండరాం(kodandaram) అధికార పార్టీ మంత్రి కేటీఆర్(KTR)కు సవాల్ విసిరారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటివరకు రెండు లక్షలు కల్పించామని చెబుతున్న దాంట్లో నిజం లేదని అన్నారు. ఈ క్రమంలో ఈ అంశంపై మంత్రి కేటీఆర్ చర్చలకు రావాలని ఛాలెంజ్ చేశారు.
హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళదామని సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ క్రమంలో ప్రమాణం చేసేందుకు కేసీఆర్ రావాలని రేవంత్ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు.
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీలో సీటు దక్కని అసంతృప్తి నేతలు ఇతర పార్టీలకు మారుతున్నారు. తాజాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రేవంత్ రెడ్డిని కలిశారు. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరవుతున్న వేళ పార్టీ నేతలు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.