ఆదిలాబాద్: తలమడుగులో ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతున్న తీరును మంగళవారం కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శిని సర్వేలో ఏర్పడుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లాగిన్ సమస్య ఉందనడంతో సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహశీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీఓ చంద్ర శేఖర్, తదితరులు ఉన్నారు.
కామారెడ్డి: పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా పెద్ద కోడపగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం అమిత్ షా దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఛైర్మన్ సౌదగర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్: కేంద్రమంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించడం దారుణమని మండిపడ్డారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
WGL: కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్యకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వద్దన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. అమిత్షాపై చర్యలు తీసుకునేంతవరకూ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటామనారు.
KMM: దేశానికి కమ్యూనిస్టులే ఆదర్శం అని సీపీఐ జాతీయ నేత బాగం హేమంతరావు అన్నారు. సీపీఐ శత వసంతాల సందర్భంగా మంగళవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వందేళ్ల ఉద్యమ పార్టీగా సీపీఐ ఖ్యాతి పొందిందన్నారు. పేద ప్రజలు, కార్మికుల పక్షాన ఎన్నో ఉద్యమాలు చేసి అప్పటి ప్రభుత్వాల మెడలు వంచి, వారి సమస్యలు పరిష్కరించిందన్నారు.
JGL: పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంని, గ్రౌండ్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్టేడియంలో కావాల్సిన మరమ్మత్తులను చేపించాలని సూచించారు. అలాగే స్విమ్మింగ్ పూల్ వాటర్ని టెండరింగ్ ద్వారా శుభ్రపరచాలన్నారు. వారి వెంట ఆర్డీవో మధుసుధన్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి ఉన్నారు.
GDWL: అలంపూర్లోని ఆర్టీసీ బస్టాండ్లో పోలీసులు మంగళవారం విజిబుల్ పోలీసింగ్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల డీఎస్పీ సత్యనారాయణ స్టేషన్ను సందర్శించి విజిబుల్ పోలీసింగ్ పెంచాలని సూచించారు. ఆ మేరకు ఏఎస్ఐ ఎస్ఎం భాషా ఆధ్వర్యంలో పోలీసులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడికి వచ్చిన ప్రయాణికులకు ప్రస్తుతం జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించారు.
BDK: కరకగూడెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంజూరైన నూతన అంబులెన్స్ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. గత ప్రభుత్వం ఆసుపత్రులకు అంబులెన్స్ను కేటాయించకపోవడం వల్ల అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. కానీ ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్సును మంజూరు చేసిందని ఎమ్మెల్యే పాయం చెప్పారు.
NGKL: బాపు బాటలో సత్య సాధన లక్ష్యంగా విశ్రాంత ఉద్యోగి డా. విజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం నాటికి 84 వ రోజుకు చేరుకుంది. జిల్లాకు చేరుకున్న పాదయాత్ర బృందానికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. దేశంలో శాంతిని నెలకొల్పడమే ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టినట్లు విశ్రాంత ఉద్యోగి డా.విజయకుమార్ తెలిపారు.
JGL: రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజల మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకులంగా స్పందించి అల్లిపూర్ మండల కేంద్రం ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని ఆన్నారు.
MBNR: జడ్చర్ల ఫ్లైఓవర్ వద్ద హైదరాబాద్కు వెళ్లే మార్గంలో రహదారి పై ప్రైవేటు వాహనాలు నిలుపుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. రద్దీ రహదారి కావడం, ఆ ప్రాంతం ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
HNK: అంబేద్కర్పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. హనుమకొండలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అమిత్షాను క్యాబినెట్ నుంచి భర్త రఫ్ చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. మోడీ వెంటనే అమిత్ షాతో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
KMM: సత్తుపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రానున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కరుణాకర్, హోప్ మినిస్ట్రీస్ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో 50 మంది పాస్టర్లకు ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమాయి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ పదిమందికి ప్రేమ పంచడం సూచిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
NZB: గత ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించడంలో విఫలమైనట్లు మధ్యాహ్న భోజన పథక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి ఆరోపించారు. మంగళవారం యూనియన్ శిక్షణ శిబిర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటే ప్రభుత్వమే నిత్యవసర వస్తువులు సరుకులు, గ్యాస్, కోడిగుడ్లు సరఫరా చేయలని డిమాండ్ చేశారు.
WNP: అంబేద్కర్ను అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ తీరుకు నిరసిస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ నేతలు, కార్య కర్తలు మంగళవారం నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.