కామారెడ్డి: పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా పెద్ద కోడపగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం అమిత్ షా దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఛైర్మన్ సౌదగర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.