SRPT: తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బస్ డిపో సాధన కమిటీ కన్వీనర్ కడెం లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ శాగంటి అనసూయకు బస్ డిపో నిర్మాణం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో బస్ డిపో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బస్ డిపో నిర్మాణం చేయాలని పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు.
JN: జనగామ పోలీసు శాఖలో సేవలందించేందుకు ప్రభుత్వం ఐపీఎస్ అధికారిని నియమించింది. యూపీఎస్సీ 2023 ఫలితాల్లో 88వ ర్యాంకుతో సత్తా చాటిన మనన్ భట్ ట్రైనీ అధికారిగా జనగామలో అడుగు పెట్టారు. ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఆయన కొన్ని రోజులు సేవలందించనున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ఛార్జి తీసుకున్నారు.
WGL: ఎనుమాముల ఇందిరమ్మ ఫేస్ కాలనీ-1లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, ఇతర సౌకర్యాలు కల్పించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు స్థానిక నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించి పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
JN: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను జనగామ కాంగ్రెస్ నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గంలోని పలు సమస్యలను వారికి వివరించాడు. అలాగే నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరారు.
SDPT: తెలంగాణ చేనేత ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా చిలుక ఆంజనేయులు నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ముదిగొండ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీచేశారు. నియమకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.
HNK: భారతదేశంలో అన్ని మతాలను, కులాలను గౌరవించే సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. హన్మకొండ అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పూల మాలలు వేసి నివాళులు అర్పించి నిరసన తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికార మధంతో మాట్లాడుతున్నారని అన్నారు.
NZB: బాన్సువాడ వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యబోధన సాగాలని నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అధ్యాపకుల అకడమిక్ రిజిస్ట్రర్లు తనిఖీ చేశారు. అధ్యాపకులు బోధించే 90 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం విద్యార్థులు బాగా చదివి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
WGL: వరంగల్ జిల్లా వెజిటేబుల్ సప్లయర్స్ నాయకులు ఈరోజు నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కామన్ డైట్ మెనూలో ఉన్న వెజిటేబుల్ సప్లై విషయంలో జిల్లా వ్యాప్తంగా కావాల్సిన వెసులుబాటుపై విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల నవీన్, ప్రసాద్, వేణు పాల్గొన్నారు.
ఆదిలాబాద్: అంంబేద్కర్ పట్ల పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం అందజేశారు. అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
NZB: బోధన్ పట్టణంలోని అమృతాదిత్య చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 2025 నూతన సంవత్సరపు క్యాలెండర్ను మంగళవారం బోధన్ డివిజన్ ఎసీపీ కార్యాలయంలో ఏసీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో సంస్థ ఛైర్మెన్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, డైరక్టర్లు బుర్కా శంకర్ గౌడ్, నరేష్ అప్పా, ప్రతాప్ గుప్తా, ప్రసాద్ ఎల్లమయ్య పాల్గొన్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాకే ఐకానిక్గా ఉన్న సెంట్రల్ జైలును కూల్చి ఆ స్థానంలో సూపర్ స్పెషాలిటీ పేరిట లోన్లు తీసుకొని గత ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వృథా చేశారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న హరీశ్ రావు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఆలస్యం అవుతుందని చెప్పారు.
ఆదిలాబాద్: తలమడుగులో ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతున్న తీరును మంగళవారం కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శిని సర్వేలో ఏర్పడుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లాగిన్ సమస్య ఉందనడంతో సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహశీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీఓ చంద్ర శేఖర్, తదితరులు ఉన్నారు.
కామారెడ్డి: పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా పెద్ద కోడపగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం అమిత్ షా దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఛైర్మన్ సౌదగర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్: కేంద్రమంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించడం దారుణమని మండిపడ్డారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
WGL: కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్యకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వద్దన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. అమిత్షాపై చర్యలు తీసుకునేంతవరకూ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటామనారు.