• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఏజీపీని సన్మానించిన నాయకులు

ఆదిలాబాద్: ఖానాపూర్ కోర్టు ఏజీపీగా నియమితులైన ఆసీఫ్ అలీని అంబేద్కర్ సంఘం ఖానాపూర్ నాయకులు సన్మానించారు. మంగళవారం వారు ఖానాపూర్ పట్టణంలో ఏజీపీ ఆసీఫ్ అలీని శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేస సతీష్, సీనియర్ నాయకులు రేవతి రాజేశ్వర్ నేత, శ్యామ్, జన్నారపు శంకర్, గొర్రె గంగాధర్, రసమల శేఖర్, ప్రణీత్, రాజేశ్వర్, ఎం.సురేష్, దామోదర్ ఉన్నారు.

December 24, 2024 / 01:13 PM IST

హుస్నాబాద్ బస్ స్టేషన్ పరిశీలించిన మంత్రి పొన్నం

KNR: హుస్నాబాద్ బస్ స్టేషన్ పరిసరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న బస్ స్టాండ్ పునరాభివృద్ది మరమత్తులు పనులు ఎక్కడి వరకు వచ్చాయని, ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. పనులు ఆలస్యంపై అధికారులతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్ స్టాండ్‌లో బ్యూటిఫికేషన్ లోపలికి బయటకు వచ్చే మార్గాల అభివృద్దిపై చర్చించారు.

December 24, 2024 / 01:10 PM IST

మాజీ కో ఆప్షన్ సభ్యుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

మహబూబ్ నగర్: నవాబుపేట మండలం మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖాజా మైనుద్దీన్ కుటుంబాన్ని జడ్చర్ల మాజీ శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి మంగళవారం పరామర్శించారు. ఖాజా మైనుద్దీన్ ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీకి ఖాజా మైనుద్దీన్ ఎనలేని సేవలు అందించారని వెల్లడించారు.

December 24, 2024 / 01:10 PM IST

మల్లికార్జున్ సేవలు అమోఘం: ఎమ్మెల్యే

మహబూబ్ నగర్: జిల్లా అభివృద్ధికి మహబూబ్ నగర్ మాజీ ఎంపీ స్వర్గీయ మల్లికార్జున్ ఎంతో కృషి చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అన్నారు. మల్లికార్జున్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పద్మావతి కాలనీలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

December 24, 2024 / 01:09 PM IST

2024 సంవత్సరంలో జిల్లాలో 3106 కేసులు

SRCL: జిల్లాలో 2024 సంవత్సరంలో 3106 కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం 2024 వార్షిక నివేదికను ఎస్పీ విడుదల చేశారు. ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులస్నేహపూర్వక విధానం, పోలీసుల పారదర్శక పనితీరు విధానం బాగుందన్నారు.

December 24, 2024 / 01:07 PM IST

బస్ డిపో నిర్మాణం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్‌కు వినతి

SRPT: తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బస్ డిపో సాధన కమిటీ కన్వీనర్ కడెం లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ శాగంటి అనసూయకు బస్ డిపో నిర్మాణం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో బస్ డిపో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బస్ డిపో నిర్మాణం చేయాలని పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు.

December 24, 2024 / 01:06 PM IST

జనగామకు ట్రైనీ ఐపీఎస్ అధికారి సేవలు

JN: జనగామ పోలీసు శాఖలో సేవలందించేందుకు ప్రభుత్వం ఐపీఎస్ అధికారిని నియమించింది. యూపీఎస్సీ 2023 ఫలితాల్లో 88వ ర్యాంకుతో సత్తా చాటిన మనన్ భట్ ట్రైనీ అధికారిగా జనగామలో అడుగు పెట్టారు. ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఆయన కొన్ని రోజులు సేవలందించనున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ఛార్జి తీసుకున్నారు.

December 24, 2024 / 01:06 PM IST

వర్ధన్నపేట ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

WGL: ఎనుమాముల ఇందిరమ్మ ఫేస్ కాలనీ-1లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, ఇతర సౌకర్యాలు కల్పించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు స్థానిక నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించి పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

December 24, 2024 / 01:03 PM IST

చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని వినతిపత్రం

JN: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను జనగామ కాంగ్రెస్ నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గంలోని పలు సమస్యలను వారికి వివరించాడు. అలాగే నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరారు.

December 24, 2024 / 01:02 PM IST

చేనేత ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా ఆంజనేయులు

SDPT: తెలంగాణ చేనేత ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా చిలుక ఆంజనేయులు నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ముదిగొండ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీచేశారు. నియమకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.

December 24, 2024 / 12:58 PM IST

అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

HNK: భారతదేశంలో అన్ని మతాలను, కులాలను గౌరవించే సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. హన్మకొండ అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పూల మాలలు వేసి నివాళులు అర్పించి నిరసన తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికార మధంతో మాట్లాడుతున్నారని అన్నారు.

December 24, 2024 / 12:58 PM IST

‘వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి’

NZB: బాన్సువాడ వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యబోధన సాగాలని నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అధ్యాపకుల అకడమిక్ రిజిస్ట్రర్లు తనిఖీ చేశారు. అధ్యాపకులు బోధించే 90 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం విద్యార్థులు బాగా చదివి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

December 24, 2024 / 12:52 PM IST

నర్సంపేట ఎమ్మెల్యేని కలిసిన సప్లయర్స్ యూనియన్

WGL: వరంగల్ జిల్లా వెజిటేబుల్ సప్లయర్స్ నాయకులు ఈరోజు నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కామన్ డైట్ మెనూలో ఉన్న వెజిటేబుల్ సప్లై విషయంలో జిల్లా వ్యాప్తంగా కావాల్సిన వెసులుబాటుపై విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల నవీన్, ప్రసాద్, వేణు పాల్గొన్నారు.

December 24, 2024 / 12:51 PM IST

‘అమిత్ షాపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి’

ఆదిలాబాద్: అంంబేద్కర్ పట్ల పార్లమెంట్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

December 24, 2024 / 12:50 PM IST

నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎసీపీ

NZB: బోధన్ పట్టణంలోని అమృతాదిత్య చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 2025 నూతన సంవత్సరపు క్యాలెండర్‌ను మంగళవారం బోధన్ డివిజన్ ఎసీపీ కార్యాలయంలో ఏసీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో సంస్థ ఛైర్మెన్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, డైరక్టర్లు బుర్కా శంకర్ గౌడ్, నరేష్ అప్పా, ప్రతాప్ గుప్తా, ప్రసాద్ ఎల్లమయ్య పాల్గొన్నారు.

December 24, 2024 / 12:49 PM IST