• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఏసుప్రభు జీవిత స్ఫూర్తిదాయకం: హరీష్ రావు

MDK: దయ, సేవాగుణం, క్షమాగుణం కలిగిన ఏసుప్రభు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని మెన్నోనైట్ బ్రదర్న్ క్రైస్తవ సంఘం ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండగను అధికారికంగా నిర్వహిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

December 24, 2024 / 03:03 PM IST

ఐడీఓసీలో సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

WNP: అధికారుల కార్యాలయ సముదాయంలో నేడు మంగళవారం అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి బీపీ, షుగర్, టీబీ స్క్రీనింగ్ చేశారు. అవసరమైన వారికి ఎక్స్‌రేలు కూడా తీశారు. జిల్లా అంతట టీబీ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా 20 లక్షల రూపాయలతో ఒక డిజిటల్ ఎక్స్‌రే ప్లాంటును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెప్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు చెప్పారు.

December 24, 2024 / 03:02 PM IST

ఐటీ మంత్రికి ఎస్ఎఫ్ఐ నేతల వినతి పత్రం

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఎస్ఎఫ్ఐ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం కాసేపు విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజకుమార్ తదితరులు ఉన్నారు.

December 24, 2024 / 02:58 PM IST

సెల్ఫ్ టీచింగ్ చేస్తూ నిరసన తెలిపిన విద్యార్థులు

BDK: సర్వశిక్ష ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా డీవైఎఫ్ఎ ఆధ్వర్యంలో ఆళ్లపల్లి కేజీబీవీ విద్యార్థులు పాఠశాల ఎదుట వారి పుస్తకాలు వారు తీసుకొని వారే స్వయంగా పాఠాలు బోధించుకుంటూ సెల్ఫ్ టీచింగ్ చేస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఉపాధ్యాయుల, సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కారం చేసి రెగ్యులర్‌గా విద్యార్థుల చదువులు ముందుకు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

December 24, 2024 / 02:53 PM IST

ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం

NZB: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడడం సరికాదని MLA ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ ఫండ్ విషయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి సీఎంకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

December 24, 2024 / 02:53 PM IST

టీన్జీవోస్‌లో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సభ్యత్వం

MNCL: మంచిర్యాల జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు మంగళవారం టీఎన్జీవోస్ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి వారికి సభ్యత్వ నమోదు పత్రాలు అందజేశారు. జిల్లా కార్యదర్శి రామ్మోహన్, కేంద్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు పాల్గొన్నారు.

December 24, 2024 / 02:53 PM IST

అమిత్‌షాకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు

KMR: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నేడు ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా, నిరసన నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేద్కర్‌పై నిండు పార్లమెంట్ సభలో అవహేళనగా అమిత్‌షా మాట్లాడారని ఆయన మండిపడ్డారు.

December 24, 2024 / 02:46 PM IST

ఏడున్నర లక్షల ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే జారే

BDK: దమ్మపేట మండలం బంజారాకాలనీకి చెందిన బి. కావ్యకు పుట్టుకతోనే వినికిడి సమస్య. డాక్టర్లు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు చెప్పగా స్పందించిన ఎమ్మెల్యే బాలిక వైద్యానికి అవసరమైన ఏడున్నర లక్షల విలువ చేసే ఎల్‌ఓసీని ప్రభుత్వం ద్వారా మంగళవారం మంజూరు చేయించారు.

December 24, 2024 / 02:39 PM IST

శ్రీ తేజను పరామర్శించిన ఎంపీ డీకే అరుణ

MBNR: సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులతో ఆమె మాట్లాడి శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ తేజ తండ్రి రమేష్‌ను ఆమె పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు అరుణ తెలిపారు.

December 24, 2024 / 02:34 PM IST

‘ఉచిత వైద్య శిబిరం వినియోగించుకోవాలి’

WNP: ఆత్మకూరు మండలం కత్తేపల్లి గ్రామంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు హెల్త్ కేర్ అండ్ వెల్‌నెస్ సెంటర్ వారు తెలిపారు. గ్రామంలోని గ్రామ పంచాయతీ దగ్గర ఉ. 9 గంటలకు మ. 3 గంటల వరకు ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఆరోగ్య పరీక్షలకు వచ్చేవారు లేబర్ కార్డు తీసుకొని రావాలని వారికి వివిధ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

December 24, 2024 / 02:27 PM IST

వినూత్న రీతులలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

నల్గొండ: విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని చేస్తున్న సమ్మె ఈరోజుతో 15 రోజులకు చేరింది. ఒక్కో రోజు ఒక్కో విధంగా వినూత్న రీతులలో ప్రభుత్వానికి తమ బాధను తెలియజేస్తున్నారు. దయచేసి తొందరగా తమ ఉద్యోగాల రెగ్యులరైజేషన్ ప్రక్రియను ముందుకు కొనసాగించి పేస్కేల్ ప్రకటించాలని వారు కోరుతున్నారు.

December 24, 2024 / 02:24 PM IST

రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలి: సీఐ

HNK: రౌడీషీటర్లు సత్పవర్తన కలిగి ఉండాలని నేర సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సుబేదారి సీఐ సత్యనారాయణ రెడ్డి సూచించారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 24, 2024 / 02:24 PM IST

రాజన్నను దర్శించుకున్న నర్సంపేట ఎమ్మెల్యే

SRCL: కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కోడె మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ పర్యవేక్షకులు బి. తిరుపతి రావు ఎమ్మెల్యే దంపతులకు శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం ఇచ్చారు. అర్చకులు వారిని ఆశీర్వదించారు.

December 24, 2024 / 02:23 PM IST

అమిత్ షా వ్యాఖ్యలపై బీఎస్పీ శాంతియుత నిరసన

NRPT: రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేడ్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణపేటలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు శీను మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

December 24, 2024 / 02:21 PM IST

‘సీఆర్టీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి’

ఆదిలాబాద్: సీఆర్టీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ తెలిపారు. మంగళవారం ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో సమ్మె చేస్తున్న సీఆర్టీలను ఆయన కలిసి మద్దతు తెలిపారు. అలాగే వారికి సహాయంగా రూ. పదివేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జైవంత్ రావు, బీఆర్ఎస్వీ అధ్యక్షులు ధరణి రాజేష్, తదితరులు ఉన్నారు.

December 24, 2024 / 02:16 PM IST