SRPT: తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బస్ డిపో సాధన కమిటీ కన్వీనర్ కడెం లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ శాగంటి అనసూయకు బస్ డిపో నిర్మాణం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో బస్ డిపో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బస్ డిపో నిర్మాణం చేయాలని పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు.