ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దాంతో పాటు అనేక రకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
బీఆర్ఎస్, బీజేపీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు, నేతలు దుబ్బాకకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరారు.
హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. కాప్రా, ఘట్కేసర్, సరూర్నగర్, ఉప్పల్, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ సహా పలు చోట్ల ఈ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
మీకు అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయా? అయితే జాగ్రత్త. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా పలువురికి కాల్ చేస్తూ దోచేస్తున్నారు. ఇటివల హైదరాబాద్ కు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ నుంచి ఏకంగా రూ.1.59 కోట్లు లాగేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణలో ఈనెల 30న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నిన్నటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈనెల 27న పూర్తి కానుంది. అయితే మొదటిరోజు 9 వేలకుపైగా ఈ ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే వీటని సీనియర్ సిటిజన్లతోపాటు అత్యవసర సేవల 13 విభాగాల ఉద్యోగులు కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
మంత్రి కేటీఆర్ ఫోన్ కాల్ ఆడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. సిరిసిల్లలో కేటీఆర్కు ఓటమి భయం పట్టుకుందని, తన సొంత నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి కేటీఆర్ భయపడుతున్నారని విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం కేటీఆర్ ఫోన్ కాల్ ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దేశాని ఇందిరాగాంధీ చేసిన సంక్షేమం ఏం లేదన్న కేసీఆర్ మాటలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని తెలిపారు. మోదీ, కేసీఆర్ ఒకటేనని అన్నారు.
టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. చిప్పకూడు తిన్న వ్యక్తి సీఎం కాలేడంటూ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజా ఆశీర్వాద సభలో కోరారు.
తెలంగాణలో మాజీ క్రికెటర్ల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నేత అయిన వినోద్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అయూబ్ ఇంటిని కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు.
ఈ సారి కూడా తన చేతిలో బండి సంజయ్ ఓడిపోతారని మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఆడిన గుండెపోటు డ్రామాను గుర్తుచేశారు.
ప్రపంచంలోనే తొలి 3డీ టెంపుల్ తెలంగాణలో ఏర్పాటు కానుంది. సిద్దిపేటలో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో మూడు ఆలయాలను నిర్మిస్తున్నారు. రోబోటిక్ మిషన్ సాయంతో ఆలయాలను ఏర్పాటు చేయనున్నారు. వరల్డ్ లోనే తొలి త్రీడీ టెంపుల్ ఇదే కావడం విశేషం.
ప్రాజెక్టులు చూపించి ఓట్లు అడుగుదామా సీఎం కేసీఆర్ అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
గాంధీ భవన్ రిమోట్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ పోలీస్ అధికారితో దురుసుగా వ్యవహరించారని కేసు ఫైల్ చేశారు. పోలీసుల తీరును అక్బర్ సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పు పట్టారు.