హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కార్యాలయంలో ఉండగానే తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. దీంతో పార్టీ నేతలంతా ప్రచార బిజీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చోటా మోటా నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ఆటో డ్రైవర్లకు ఒకే రోజు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ శుభవార్తలు చెప్పారు. ఆటో డ్రైవర్ల ఫిట్నెస్, సిర్టిఫికెట్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే యాదాద్రిగుట్టపైకి ఆటోలు నడిపేందుకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అనుమతులు ఇస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సును ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు చేశారు. బస్సులో అణువణువూ తనిఖీ చేయగా వారికి సీఎం కేసీఆర్, ఆయన సిబ్బంది సహకరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈసీ గట్టి చర్యలు తీసుకుంది. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విడుదలకు అనుమతివ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది.
హైదరాబాద్లో(Hyderabad) హోటళ్లు, రెస్టారెంట్లు ఇకపై ఉదయం 5 గంటలకే ఓపెన్ చేయనున్నారు. అంతేకాదు రాత్రి కూడా 12 గంటల వరకు తెరిచే ఉంచనున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల ఆయన కొల్లాపూర్ ఎందుకు వచ్చాడని ప్రశ్నించారు.
తాము ఎందుకు పార్టీ మారామో వివరించారు రాములమ్మ విజయశాంతి. ఆ నాడు బీఆర్ఎస్ పార్టీపై చర్యలు ఉంటాయని చెబితేనే పార్టీలో చేరామని.. ఎలాంటి యాక్షన్ తీసుకోక పోవడంతో తిరిగి సొంతగూటికి చేరామని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్ ఉంటుంది. అదే అంశంపై నేతలు ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు. ఇదే అంశంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి రాజ్యం ఏలుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.
మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను. ప్రజా జీవితంలో ఉండటం వల్ల నాన్న కేసీఆర్ ప్రభావం నాపై చిన్నప్పటి నుంచే ఎక్కువగా ఉండేది. నా చెల్లి కవిత చాలా డైనమిక్.. నా భార్య కూడా చాలా ఓపికగా ఉంటుందని అన్నారు మంత్రి కేటీఆర్.
ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్కు ఆయన తనయుడు షాక్ ఇచ్చాడు. బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబుతో పాటు జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, ఇతర బీజేపీ నాయకులు పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
హైదరాబాద్ మింట్లో తయారైన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మార నాణేలకు విశేష స్పందన లభిస్తుంది. రెండున్నర నెలల్లో 25వేల నాణేలు అమ్ముడుపోవడం దేశంలోనే సరికొత్త రికార్డని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు
తెలంగాణ బర్రెలక్క (శిరీష)కు మద్దతుగా యానాం మాజీ మంత్రి, ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయలు విరాళంగా పంపించారు
కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అమ్మమ్మ ఊరు ఉందట.. మరి ఇన్నాళ్లు నియోజకవర్గం గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి