బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు.
బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి తీసుకోని వస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలపై విచారణకు కమిటీ వేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ శివారు అప్పా జంక్షన్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. రూ.6.5 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.
గద్వాలలో సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి చిట్టా చాలా ఉందన్నారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో వేల కోట్లను మింగేసిండని అమిత్ షా పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. బీజేపీకి సీనియర్ నేత మొవ్వ సత్యనారాయణ రాజీనామా చేశారు.
జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలో ఇటిక్యాల రోడ్డు షోలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత సృహతప్పి పడిపోయారు.
హైదరాబాద్పై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ కోకాపేటలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఆ అధ్యయన కేంద్రంలోనే ఉంటూ ఆదిశంకరుల వారి అద్వైత తత్త్వంపై పరిశోధనలు చేపడతానని స్పష్టం చేశారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టీ- కాంగ్రెస్ దూసుకుపోతుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరికొన్ని రోజుల సమయం మాత్రం ఉండటంతో ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు, మేనిఫెస్టోతో ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో టీ- కాంగ్రెస్ ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలను నియమించింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్గా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన లేడీ ఫైర్ బ్రాండ్ విజయశాంతిని నియమించ...
తెలంగాణలో పర్యాటకరంగానికి అపార అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణంతో ఈ రంగంలో ఆకర్షణీయమైన అవకాశాలున్నాయన్నారు. తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే తనకు పర్యాటకశాఖ కేటాయించమని సీఎం కేసీఆర్ను అడుగుతానని చెప్పారు.
తెలంగాణలో ఎన్నికల వేళ మంత్రితోపాటు తిరుమలకు వెళ్లినందుకు ఇద్దరు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి చేసి దోచుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడినట్లు గుర్తు చేశారు. వీటికి ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్ కేసీఆర్ ను ప్రశ్నించారు. దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ పదవీ విరమణకు సిద్ధమని అంటున్నారని, ప్రజలు కూడా ఆయన్ను దించేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా ఈ మేరకు పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలను వెంటనే అమలు చేస్తామన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.ప్రతి ఒక్కరికీ మేలు చేసేలా ఈ మేనిఫెస్టోని రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా కాంగ్రెస్ అభివర్ణించింది.
మంత్రి సత్యవతి రాథోడ్ కు మంగళ హారతితో బీఆర్ఎస్ మహిళలు స్వాగతం పలికారు. మంగళహారతి పళ్లెంలో రూ.4వేలను మంత్రి సత్యవతి రాథోడ్ వేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్ఎస్టీ బృందం మంత్రిపై ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.యాంకర్ కత్తి కార్తీక బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక టికెట్ను ఆశించారు.