NRML: కోతుల బెడదను అరికట్టాలని ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు, పాలకులు మాత్రం కోతుల నియంత్రణకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు. ఆదివారం కడెం మండలం దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఓ వాహనానికి కోతులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి చెట్టును ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామాల్లో సైతం కోతులు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి.
పెద్దపల్లి జిల్లాలో ఆర్ & బీ శాఖ పనితీరుపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్న్, నాన్న్, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులతో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు.
ASF: సిర్పూర్(యు) మండలం కొత్తపల్లి నార్త్ బీట్లో జోడేఘాట్ FRO రమేశ్ సోమవారం గస్తీ నిర్వహించారు. తనిఖీల్లో వన్యప్రాణుల పాదముద్రలను గుర్తించినట్లు తెలిపారు. అడవులను ధ్వంసం చేసినా, మూగజీవాలను వేటాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవిని కాపాడుకోవడం సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి అనూష, బీట్ అధికారి మహేశ్, పాల్గొన్నారు
SGR: మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లను సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కౌన్సిల్లో రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
MBNR: గత ఏడు దశాబ్దాలుగా భారత రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేస్తూ మౌలిక అంశాలను స్పష్టం చేస్తున్నదని సామాజిక విశ్లేషకుడు, పాలమూరు యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు డా. నాగం కుమారస్వామి తెలిపారు. రాజ్యాంగం పాలకులకోసం మాత్రమే కాదు, పీడిత ప్రజల విముక్తికి రూపొందించబడిన పవిత్ర గ్రంథమని, దాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యతని పేర్కొన్నారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని పీఆర్ రోడ్డు నుంచి సోమార్పేట్ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2.44 కోట్లతో భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని, భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన గ్రామాలకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని అన్నారు.
MDK: చేగుంట మండలం రుక్మాపూర్లో ఏజెన్సీ కంపెనీ ద్వారా వరి సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి రైతులకు పరిహారం చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, సర్పంచ్ నవీన్, pacs ఛైర్మెన్ పరమేశ్, ఎఎంసి డైరెక్టర్ స్టాలిన్ నర్సింలు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా స్థాయి ఛీఫ్ మినిస్టర్స్ కప్ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన అభ్యర్థులకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బహుమతులను అందించారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
BHNG: మోత్కూరు మున్సిపాలిటీని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం మోత్కూర్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్పర్సన్ మరియు వైస్ ఛైర్మన్లు పదవి బాధ్యతల స్వీకరణ తదుపరి మొదటి సాధారణ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి అందరూ భాగస్వాములు కావాలన్నారు.
BDK: చర్ల సత్యనారాయణపురం గ్రామం సర్పంచ్ గౌతమి ప్రభుత్వ మీసేవలో విధులు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా గెలిచి ప్రభుత్వ మీసేవ దగ్గర విధులు నిర్వహిస్తున్నారని ఇది పంచాయతీరాజ్ చట్టానికి వ్యతిరేకమని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ ఇవాళ స్పష్టం చేశారు. తనపై చర్యలు తీసుకోవాలని ఎండీవోకు వినతిపత్రం అందజేశారు.
SRPT: సూర్యాపేట మున్సిపాలిటీని సుందరీకరణకు కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని 46, 47వ వార్డుల్లో రూ.50 లక్షలతో నాలా కల్వర్టు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ ఛైర్పర్సన్ నివేదితతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. వారం రోజుల్లో సీఎంని కలిసి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.
HYD: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇవి జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హాజరవుతుండగా, 1,495 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 28,500 మంది ఇన్విజిలేటర్లు నియమించారు.
VKB: దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన తుప్పలి వెంకటమ్మకి సీఎం సహాయనిధి కింద రూ. 60,000 మంజూరైంది. ఈ చెక్కును గ్రామ సర్పంచ్ సుజాత బసప్ప, ఉప సర్పంచ్ జె.దస్తయ్య అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించారని సర్పంచ్ తెలిపారు.
KMR: జిల్లా కేంద్రంలోని సీఐటీయూ నాయకులను ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్స్టేషన్కు తరలించారు. ఆశ వర్కర్ల సమస్యలపై సీఐటీయూ ‘ఛలో హైదరాబాద్’కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీలో సోమవారం సీఐటీయూ నాయకుడు జె.రవీందర్ను హౌస్ అరెస్ట్ చేశారు.
NZB: వేల్పూర్ మండలం అంక్సాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం ప్రారంభమైంది. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మల్లీశ్వరి ఉపాధ్యాయులకు అకాడమిక్ విషయాలపై పలు సూచనలు చేశారు. ఈ కాంప్లెక్స్ సమావేశంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.