KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 3వ విడతలో భాగంగా సోమవారం 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ సోమవారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.761 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు రైతులను కోరారు.
JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారి పల్లకి సేవ కన్నులపండువగా సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను రకరకాల పూలతో అలంకరించిన పల్లకిలో ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
SRPT: జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం గ్రామ మొదటి వార్డులో కోతుల సమస్య నివారణకై ఆ వార్డు సభ్యురాలు చెరుకు స్వరూప భర్త చెరుకు సైదులు ఇవ్వాళ చింపాంజీ వేషధారణలో వీధులలో తిరుగుతూ కోతులను తరిమివేశారు. వార్డులో కోతుల సమస్య నివారణ కోసం చింపాంజీ దుస్తులను తెచ్చి వేసుకొని తిరుగుతున్నట్లు తెలిపారు.
SRCL: సమస్యల పరిష్కారం కోరుతూ ‘చలో హైదరాబాద్’ కమిషనరేట్ ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను సోమవారం తంగళ్లపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్కు తరలించినా తమ పోరాటం ఆగదని ఆశా కార్యకర్తలు నినదించారు.
MNCL: క్యాతన్ పల్లి మున్సిపల్ పాలక వర్గాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ సోమవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజా తీర్పును అగౌరవపరుస్తూ అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటర్ల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వెంటనే పాలక వర్గం ఏర్పాటయ్యేలా చూడాలన్నారు.
HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో సోమవారం పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు ప్రత్యేక సమావేశాన్ని జరుపుకున్నారు.1981-82వ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు సమావేశాన్ని జరుపుకుని ఆత్మీయతను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు కతోలిక పీఠాధిపతిగా కొనసాగుతున్న జయ రావు పులిమేరాను సహచర మిత్రులు ఘనంగా సన్మానించారు.
ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో సోమవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,000గా నిర్ణయించారు. గత వారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధరలో సైతం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
SRPT: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఈరోజు నియోజకవర్గంలో పలు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా మధ్యాహ్నం 3:00 గంటలకు కోదాడ మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్మన్, కౌన్సిలర్ల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం లారీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొంటారని పిఆర్ఓ వెంకట రెడ్డి తెలిపారు.
KMR: ట్విన్స్ డే రోజే ట్విన్స్ వివాహం చేసుకున్న అరుదైన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగింది. ఘన్పూర్కు చెందిన భాస్కర్- సుజాత దంపతుల కవల కుమారులు విజయ్కుమార్, వినయ్కుమార్కు తాడ్వాయి మండలం దేమే గ్రామానికి చెందిన కుమ్మరి రాజమణి- సాయన్న కవల కుమార్తెలు కీర్తన, కీర్తితో వివాహం జరిగింది. అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజే వారికి పెళ్లి అయింది.
MNCL: చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ కోరారు. సోమవారం చింతగూడ గ్రామంలోని భగత్ సింగ్ నగర్ ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఆమె పూజ చేశారు. వీబీజీ రాం జీ ద్వారా మంజూరైన రూ. 10 లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ గోడను నిర్మించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.
JN: రఘునాథపల్లి గ్రామపంచాయతీ నందు కోతుల బెడద నివారణకు స్థానిక సర్పంచ్ వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. విన్నూతంగా కొండెంగ గెట్ అప్లో సర్పంచ్, సిబ్బంది ఊరంతా తిరుగుతూ కోతులను తరిమికొట్టారు. గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు.
KMM: HYD గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల్లో తల్లాడ మండలం రంగంబంజరకు చెందిన రామ్ చరణ్ సత్తా చాటాడు. నిన్న జరిగిన జూడో పోటీల్లో రామ్ చరణ్ అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య (బ్రౌన్) మెడల్ సాధించాడు. రామ్ చరణ్ 4 నుంచి 10వ తరగతి వరకు స్పోర్ట్స్ పాఠశాలలో శిక్షణ పొందినట్లు తండ్రి ధర్మసోత్ దశరథ్ నాయక్ తెలిపారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో “లీకైన పైప్లైన్” సమస్య పై HIT TVలో నిన్న ప్రచురితమైన కథనానికి గ్రామ సర్పంచ్ సునీత-రవీందర్ స్పందించారు. ఇవాళ సర్పంచ్ సొంత ఖర్చులతో GP పంప్ ఆపరేటర్ అంజి పర్యవేక్షణలో పైప్లైన్ మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు గ్రామ సర్పంచ్కు, ముఖ్యంగా HIT TVకి కృతజ్ఞతలు తెలిపారు.
NLG: గన్యానాయక్ తండాకు చెందిన నేనావత్ రాము నాయక్ కుమార్తె వివాహానికి బీఆర్ఎస్ నాయకుడు నేనావత్ కిషన్ నాయక్ రూ.50,016 నగదును పెళ్లి కానుకగా అందజేశారు. పదవుల కంటే ప్రజల కష్టసుఖాల్లో తోడుండటమే తనకు సంతృప్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. తండా బిడ్డల అభివృద్ధి, వారి కుటుంబాల్లో ఆనందం నింపడమే తన ప్రధాన లక్ష్యమని కిషన్ నాయక్ స్పష్టం చేశారు.
వనపర్తి జిల్లాలోని గాంధీ చౌక్ కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి అవసరాల కోసం వస్తుంటారు. మహిళలు, చిన్నపిల్లలు వస్తుంటారు. గాంధీ చౌక్ లో పబ్లిక్ టాయిలెట్స్ లేనందువల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ కమిటీ సభ్యులు భోజరాజు వనపర్తి జిల్లా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి చేశారు.