MNCL: క్యాతన్ పల్లి మున్సిపల్ పాలక వర్గాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ సోమవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజా తీర్పును అగౌరవపరుస్తూ అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటర్ల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వెంటనే పాలక వర్గం ఏర్పాటయ్యేలా చూడాలన్నారు.