MNCL: జిల్లాలో ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో ఈనెల 25, 26, 27 తేదీల్లో ఎఫ్ఎల్ఎన్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. సోమవారం మంచిర్యాలలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నియమ, నిబంధనలు, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
VKB: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో VKB జిల్లా పోలీసులు ప్రభంజనం సృష్టించారని ఎస్పీ స్నేహమెహ్రా అన్నారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో పథకాలు సాధించిన పోలీసులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాకు మొత్తం 15 పథకాలు వచ్చాయని తెలిపారు. దీంతో జిల్లా ప్రతిష్ఠను పోలీసులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని వెల్లడించారు.
KMR: మహమ్మద్నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంకు చెందిన టేక్మాల్ మమత తన భర్త ప్రమాదంలో మృతి చెందిన అనంతరం, కౌలుకు ఇచ్చిన 7 గుంటల భూమిని తిరిగి ఇవ్వకుండా తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ KMR జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం తన భర్త సుధాకర్కు యాక్సిడెంట్ జరిగి అనంతరం మృతి చెందాడని తెలిపారు.
RR: చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో సోమవారం సర్పంచ్ మల్లారెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా, పెండింగ్ బిల్లు, తదితర అంశాలపై చర్చించారు. గ్రామంలోని పని చేయని సీసీ కెమెరాలు రిపేర్ చేయించి వాటిని ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్మికులకు యూనిఫామ్ అందజేసి వారిని సన్మానించారు.
ASF: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను త్వరగా పరిషకరించాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
NZB: రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన నేపథ్యంలో ధన్పాల్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
SRD: హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ మైదానంలో జరిగిన సీఎం కాపు రాష్ట్ర యోగ పోటీలో సంగారెడ్డికి చెందిన మాధవి కాంస్య పతకం సాధించింది. కాంస్య పతకం సాధించినందున సంగారెడ్డి జిల్లా డివైఎస్ఓ అఖిలేష్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్ రమేష్ లు అభినందనలు తెలిపారు.
ADB: ఉట్నూరు మండలంలోని షాంపూర్ రోడ్డు ప్రమాద బాధితులు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను సోమవారం పరామర్శించారు. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తో మాట్లాడి బాధితులకు అందుతున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని కోరారు.
SRCL: పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లాలోని అన్ని పంచాయతీ కార్మికులు తరలివచ్చి తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు.
MBNR: పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువు పై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.
NLG: నార్కట్పల్లి శివారులోని కామినేని ఫ్లైఓవర్ వద్ద సోమవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేపట్టగా, TG07T4554, TS07UH4554 నంబర్లు గల లారీల్లో హైదరాబాద్కు ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు. లారీలను, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.
జగిత్యాల జిల్లా నెట్బాల్ జట్టు ఈనెల 20 నుంచి 23 వరకు మహబూబ్నగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ చాటింది. ఈ పోటీలలో క్రీడాకారులు అద్భుతమైన ఆట తీరుతో జిల్లా గౌరవాన్ని నిలబెట్టారు. రాష్ట్రస్థాయిలో పాల్గొనడం గొప్ప అనుభవంగా ఉందని క్రీడాకారులు అన్నారు. జిల్లా క్రీడా అభిమానులు, అధికారులు జట్టును అభినందించారు.
BDK: బూర్గంపాడు(మం) సారపాక గాంధీనగర్లో నిర్మాణంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ పదేళ్లుగా అసంపూర్తిగా ఉండగా, దీనిపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించారు. మిగిలిన పనులకు నిధులు మంజూరు చేసి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
GDWL: పోలీస్ స్టేషన్కు వచ్చేది కేవలం న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చట్టప్రకారం అండగా నిలబడండి అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో ఆయన నేరుగా 10 ఫిర్యాదులను స్వీకరించారు. భూవివాదాలు, మోసాల వల్ల ఆవేదనతో వచ్చిన బాధితుల ముందే సంబంధిత అధికారులకు అప్పచెప్పారు.