జగిత్యాల రూరల్ మండల పరిధిలోని కల్లెడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుపై వస్తున్న వార్తలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో రమాదేవి స్పందించారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి జాప్యం లేదని, సాంకేతిక లోపాలతోనే కొన్ని, ఆధార్ కార్డు వివరాలు సరి లేకపోవడం వల్ల కూడా కొన్ని బిల్లులు నిలిచిపోయాయని ఆమె సృష్టం చేశారు.
PDPL: మంథని నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ. 1,00,09,000 విలువైన 266 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరైనట్లు ఎమ్మెల్యే, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మంథని 43, ముత్తారం 44, రామగిరి 44, కమాన్పూర్ 23, పాలకుర్తి 8 మందికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 78 మందికి చెక్కులు అందనున్నాయని పేర్కొన్నారు.
SDPT: మార్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని హనుమాన్ మందిరంలో గోటి తలంబ్రాల కార్యక్రమంపై ఆదివారం గజ్వేల్కి చెందిన రామకోటి రామరాజు సమావేశం నిర్వహించారు. శ్రీరామనవనాడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి అవసరమయ్యే గూటితో వచ్చిన తలంబ్రాలు వాడుతారని రామరాజు తెలిపారు. కోటి తలంబ్రాలు దీక్ష వచ్చే శనివారం భారీ ఎత్తున ఇక్కడ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
SRPT: ఈనెల 25 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు ఇంటర్ ప్రశ్న పత్రాలను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా నడుమన తీసుకువచ్చారు. జూనియర్ కళాశాలలకి సంబంధించి ప్యాక్ చేసిన ప్రశ్నాపత్రాలను పరిశీలించి, పోలీసుల ఆధ్వర్యంలో స్టేషన్ లాకర్లలో భద్రపరిచారు.
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ లోని పలు కాలనీలో సుమారు రూ. 4.5 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు MLA KR నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. రోడ్లు-డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 4.5 కోట్లు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
NZB: నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ఆదివారం జిల్లా BJP ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా BJP అధ్యక్షుడు దినేశ్ కులచారి తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
VKB: మహాత్మా బసవేశ్వరుడు చూపిన ఆధ్యాత్మిక, సామాజిక మార్గం నేటి సమాజానికి ఎంతో ఆచరణీయమని వికారాబాద్ వీరశైవ సమాజం అధ్యక్షుడు విజయకుమార్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో బసవన్న విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బసవరాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. బసవేశ్వరుడు చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు.
SRD: అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యతగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్క్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఆదివారం ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
KMR: గాంధారి మండల కేంద్రంలో 287 సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా రేపు పాల్గొన్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఈ జయంతి వేడుకలకు ఉదయం 11 గంటలకు MLA హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో మహిళ సంఘ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
MBNR: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం 131వ ఎపిసోడ్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ శ్రీమతి డీకే అరుణ ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, యువత ప్రేరణ, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటి అంశాలపై ప్రధాని ప్రసంగం ప్రజలకు దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
మేడ్చల్: అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆదివారం బోడుప్పల్లో 366వ జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి సంఘం సభ్యులు నివాళులర్పించారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో కొనసాగుతున్న కుల వివక్ష కారణంగా నాగర్ కర్నూల్లో చాకలి కులస్తులపై అగ్రకుల నేతల దాడి, 2 నెలల పసికందు మృతి దురదృష్టరమని అన్నారు.
ADB: తలమడుగు మండలంలోని భరంపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆదివారం బోథ్ ఎమ్మెల్యే జాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తి భక్తి భావాన్ని అలవరుచుకోవాలన్నారు.
SDPT: జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఈనెల 28న సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జి సునీత తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం, వారి అభిప్రాయాల సేకరణే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
KNR: శంకరపట్నం నుంచి వీణవంక వైపు వస్తున్న ఎలక్ట్రిక్ ఆటో ఆదివారం ప్రమాదానికి గురైంది. ఆముదాలపల్లి వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి నియంత్రణ కోల్పోయిన ఆటో, రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ చింతల సంపత్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
మేడ్చల్: శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకింపేట స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి విద్యార్థి శ్రీనాథ్ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం హాస్టల్ గదిలో విద్యార్థి ఉరివేసుకున్న స్థితిలో కనిపించగా తోటి విద్యార్థులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. అతన్ని అత్యవసర చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.