BHPL: గణపురం కోటగుళ్లలో హోలీ పండుగ సందర్భంగా బుధవారం మోదుగు పూలతో స్వామివారిని ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. అలంకరణ కార్యక్రమానికి ముందు మంగళవారం చంద్రగ్రహణం అనంతరం ఆలయ ప్రాంగణంలోని గణపతి, నందీశ్వరుడు నాగదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రోక్షణ పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నాగరాజు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
KMM: చింతకాని మండలంలో జరిగిన ఇసుక ట్రాక్టర్ ప్రమాద ఘటనలో యజమానిపై కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో బోనకల్ మండలం గార్లపాడుకు చెందిన నాగయ్య మృతి చెందారు.మృతుడు తొలుత 19 ఏళ్ల యువకుడిగా భావించినా పదో తరగతి సర్టిఫికెట్స్ ఆధారంగా 16 ఏళ్ల మైనర్ అని తేలింది.నిబంధనలకు విరుద్ధంగా మైనర్కు వాహనం ఇచ్చినందుకు యజమానిపై చర్యలు తీసుకున్నట్లు ఎస్సై వీరేందర్ బుధవారం తెలిపారు.
HNK: ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నేడు ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, దేవాలయాల అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యే అన్నారు.
SRPT: ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించేందుకు ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ పథకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా అధికారి దయానంద రాణి తెలిపారు. ఆసక్తి గల వారు మార్చి 31లోగా ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9848503644 నంబరును సంప్రదించవచ్చనీ అన్నారు.
NZB: నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామంలోని ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్కు బుధవారం గ్రామ సర్పంచ్ బండి చిన్నయ్య, బీజేపి నాయకులు రాయికంటి భరత్ రెడ్డి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఉన్నత పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మంజూరు చేసినందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
PDPL: జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కెనాల్ డి 83, డి 86 కాలువలకు 5వ విడత నీటి విడుదల ఈనెల 1న ప్రారంభమైందని జిల్లా ఇరిగేషన్ అధికారి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 9 వరకు 8 రోజులపాటు నీటి విడుదల జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని కాలువల ద్వారా చివరి ఆయకట్టుకు నీటిని అందించేందుకు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, రైతులు వారికి సహకరించాలని కోరారు.
JN: స్టేషన్ ఘనపూర్లో సీఐటీయు నేతలు బుధవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు హాజరై మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ నిధుల నుండే జిపి సిబ్బందికి వేతనాలు చెల్లించాలనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్నారు.
VKB: పాంబండ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని పరిగి MLA రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఆయన నివాసంలో బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ప్రాచీన చరిత్ర గల పాంబండ దేవాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాలనర్సయ్య, సర్పంచ్ శ్రీనివాస్, కోట్ల మైపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పాండు శర్మ ఉన్నారు.
RR: ఫరూఖ్ నగర్ మండల శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే సంక్షేమ బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో చదువుకుంటున్న రాజు అనే విద్యార్థి గ్రామ శివారులో ఉన్న చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించి రాజు మృతదేహాన్ని వెలికితీసాయి. వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే కుమారుడి ప్రాణం పోయిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు.
SRCL: సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన కోనమ్మ శ్రీనివాస్-అమరావతి కూతురు వివాహానికి తన వంతు సహాయంగా ఆ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిని-నరేష్ 50 కిలోల బియ్యం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతి పేదింటి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోర రవి, కోడం శ్రీనివాస్, సిరిమల్లె సత్యం, రాజయ్య, కృష్ణా హరి, మధు, అభిలాష్ పాల్గొన్నారు.
BHNG: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించే ‘ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు.
SDPT: ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా అక్కన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ‘కనువిప్పు’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాలు ఇతర సామాజిక అంశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ప్రశాంత్ సూచించారు. చట్టాలపై అవగాహన ద్వారానే నేర రహిత సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు
MBNR: హన్వాడ మండలంలోని లింగన్నపల్లిలో ఈనెల 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ను గ్రామ పెద్దలు ఆహ్వానించారు. బుధవారం ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేసి, కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
NRML: నిర్మల్ పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో లైన్మెన్ దివస్ను బుధవారం విద్యుత్ శాఖ అధికారులు నిర్వహించారు. నిర్మల్ పట్టణ సబ్ డివిజన్ పరిధిలో టౌన్, టౌన్ 2, టౌన్ 3 సోన్ సెక్షన్ పరిధిలోగల సిబ్బందిని ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యుత్ శాఖలో వారు చేస్తున్న సేవలను కొనియాడారు.
SRCL: సిరిసిల్ల విద్యానగర్లోని అద్దె భవనంలో కొనసాగుతున్న జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ఇందిరమ్మ కాలనీలోని సొంత స్థలానికి తరలించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో నిర్వహించవద్దన్న సర్కార్ ఆదేశాలతో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సొంత భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా కంటైనర్ను కార్యాలయం కోసం వినియోగించనున్నారు. త్వరలోనే సేవలు అందిస్తారు.