NZB: కమ్మర్పల్లి మండలం హసకొత్తూర్లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 100 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్ అందజేశారు. మోతి బిందు ఉన్న 22 మంది రోగులను కంటి ఆపరేషన్స్కు ఎంపిక చేసి గురువారం ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు.
MNCL: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లి మండలం మాలగురిజాలలో ఆదివారం మహిళల సమస్యలు పరిష్కారాలు అంశంపై సదస్సు నిర్వహించారు. AIDWA రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశలత పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమం గాలికి వదిలేసిన ప్రస్తుత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలు పోరాటంలోకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాన్నారు.
ADB: విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో పీఈటీ పాత్ర ఎంతో కీలకమని తెలంగాణ పీడీ, పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యాదవ భవనంలో నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యాయామ విద్య బలోపేతానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు.
MDK: కౌడిపల్లి మండలం బుజరాంగ్పల్లిలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి, 9 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.28,296 నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
WNP: జడ్చర్లలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్లో కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన విద్యార్థులు పతకాలతో మెరిశారు. అండర్-11 విభాగంలో వంశీ బంగారు, అండర్-12లో భార్గవి చంద్రకళ వెండి పతకం సాధించారు. మన్యంకొండకు చెందిన మహేష్ కూడా ప్రతిభ కనబరిచారు. విజేతలను క్రీడాభిమానులు అభినందించారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ముష్కే వెంకట్ కుటుంబానికి ఆయన మిత్రులు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. 2000 బ్యాచ్కు చెందిన వెంకట్ సహ ఉద్యోగులు సేకరించి, రూ.2 లక్షల చెక్ను వారి కుటుంబానికి అందించారు. మిత్రుడి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిన పోలీసులు స్నేహ ధర్మం చాటుకున్నారు.
నాగర్కర్నూల్ మండల పరిధిని తూడుకుర్తి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న తూడుకుర్తికి చెందిన బోనగళ్ల నాగ మశన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గురించి హుటాహుటిన నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ASF: కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మోర్లె పార్వతి ఆలోచన మేరకు ఆదివారం “నా ఊరు – నా బాధ్యత” సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ యువత స్వచ్ఛందంగా పాల్గొని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో శ్రమదానం చేశారు. గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాల్గొన్న యువత తెలిపారు.
HNK: పట్టణ కేంద్రంలోని రెడ్డి కాలనీలో ఇవాళ ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రణతి పాలిక్లినిక్ సహకారంతో వైద్య నిర్వహించారు. కాలనీలో ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా BRS రాష్ట్ర నాయకుడు, ఇండస్ ఫౌండేషన్ ఛైర్మన్ రాకేష్ రెడ్డి హాజరై, మాట్లాడారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆదివారం సమాచార హక్కు శాఖ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ లో వేరువేరుగా స్వామి అమ్మవాలను దర్శించుకున్నారు ఆలయ అర్చకులు వచ్చిన అతిథులకు పూలమాలతో స్వాగతం చెప్పి గర్భాలయంలో స్వామి అమ్మ వాళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామపంచాయతీ తీర్మానంతో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తా నుంచి కరీంపేట, పాపయ్య పల్లె ప్రజలకు ఉపశమనం లభించనుంది. పాలకులు మారిన రోడ్డు విస్తరణ చేస్తానని పలుమార్లు వాగ్దానాలు చేసి ఏళ్లు గడిచినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు వెడల్పు తో ప్రమాదాల నివారణ తగ్గుతుందన్నారు.
KMM: పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సాకారం చేసిందని కొనిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేల్లి వీరయ్య అన్నారు. ఆదివారం ముదిగొండ మండలం పెద్దమండవలో ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ నాయకులు గృహప్రవేశాలు చేశారు. గత ప్రభుత్వం పేదల ఇళ్లపై నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన కాగితోజు స్వర్ణలత గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గోపా డివిజన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ వారి పార్దివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
NZB: బాల్కొండ మండల కేంద్రంలోని గ్రంథాలయ నూతన కేంద్ర పాలకురాలిగా వరలక్ష్మి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆర్మూర్ నుంచి బదిలీపై ఆమె ఇక్కడికి రాగా, గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన స్వామి ఆర్మూర్ గ్రంథాలయానికి వెళ్లారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్యాలయంలోని పుస్తకాలు, రికార్డులు, ఫర్నిచర్ను ఆమెకు అప్పగించారు. రీడర్లకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు.
NLG: హైదరాబాద్లోని నార్ముల్ డెయిరీ ఆర్థిక, పరిపాలనా సమస్యలపై ఇవాళ జరిపిన సమీక్షలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, ఎన్డీడీబీ ఛైర్మెన్ మీనేష్ షా పాల్గొన్నారు. డెయిరీని గట్టెక్కించేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరగా, ఎన్డీడీబీ వారు సానుకూలంగా స్పందించారు. సంస్థ పునరుద్ధరణే లక్ష్యంగా ఈ సమీక్ష జరిగిందని వారు తెలిపారు.