KMM: మధిర మున్సిపాలిటీ లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్,వైస్ ఛైర్పర్సన్,కౌన్సిలర్ల సన్మాన సభ ఆదివారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 21 వ వార్డు కౌన్సిలర్ రంగా రూప మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కౌన్సిలర్ బాధితులు అప్పగించిన ప్రజలకు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.
SDPT: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధి జరిగిందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆలయం వద్ద సరైన రోడ్లు, త్రాగునీరు, వసతి సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు.
NZB: వేల్పూర్ మండలంలోని కుకునూర్ గ్రామం లో ఆదివారం నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
RR: తుర్కయంజాల్లో ఆదివారం జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తుర్కయంజాల్, ఆదిభట్ల సర్కిల్ మహిళా నాయకురాళ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకురాళ్లు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే కేవలం విద్య మాత్రమే సరిపోదని ఆర్థిక స్వయం ప్రతిపత్తికూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. మార్చి 1న మహిళా సమాఖ్య నిర్మాణ మహాసభను విజయవంతం చేయాలన్నారు.
WGL: పర్వతగిరి మండలం బూరుగుమళ్ళ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాము.
BHPL: కుమ్మేర మల్లన్న స్వామి జాతరలో రజక సోదరులపై జరిగిన దాడి తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందని TRP భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం BHPL జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కులం పేరుతో దేవుడి దర్శనానికి వెళ్లిన వారిపై హింసాత్మక దాడి చేయడం అమానుషమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
MBNR: నంచర్ల గురుకుల పాఠశాలలో టీజీ సెట్-2026 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. 5 నుంచి 9వ తరగతుల ప్రవేశాల కోసం 513 మంది నమోదు చేసుకోగా, 488 మంది విద్యార్థులు హాజరయ్యారు, 25 మంది గైర్హాజరయ్యారు. పోలీసు భద్రతతో పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా జరిగాయని ప్రిన్సిపల్ రమ తెలిపారు.
BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు కొండకింద తలనీలాలు సమర్పించి, దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. ధర్మదర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సూర్యాపేట: దాదాపు 14ఏండ్ల తరువాత వారంతా ఒకచోట కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. పాఠశాలలో చదువుకుంటున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం కుటుంబ స్థితిగతులను తెలుసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. నాటి విద్యార్థుల పూర్వసమ్మేళానానికి సూర్యాపేట సిద్దార్థ హైస్కూల్ వేదికగా మారింది.
HNK: ఓరుగల్లు సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హన్మకొండ ప్రగతి నగర్, LIC కాలనీ, సాయి నగర్, సురేంద్రపురి, పోలీస్ కాలనీలలో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రతీ కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
MHBD: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో సవార్ లచ్చమ్మ తల్లి పండుగను పురస్కరించుకుని ఇవాళ స్థానిక సర్పంచ్ మాదారి ప్రశాంత్ ఆలయంలో కొబ్బరికాయల కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంకు ఉప సర్పంచ్ కాగా మాజీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
HNK: హనుమకొండ నగరం లోని సర్క్యూట్ హౌస్లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖను ఆదివారం పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ సర్పంచ్ తొర్రి పద్మకుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్గా పాతపల్లి ఎల్లయ్య ఎన్నిక కావడంతో సింగరేణి కార్మికులు వారిని ఘనంగా సన్మానించారు. పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, కార్మిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు.
NLG: నల్లగొండలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే హాస్పిటల్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలను ఆయన పరిశీలించారు. సామాన్యులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రులు ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య పాల్గొన్నారు.
NZB: బుస్సాపూర్ గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ధోనీ పోశెట్టి (56) అనే వ్యవసాయ కూలీ మృతి చెందారు. నిన్న సాయంత్రం పని ముగించుకుని భైక్పై వస్తుండగా, యూ-టర్న్ వద్ద నిర్మల్ నుంచి ఆర్మూర్ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన పోశెట్టిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.