• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష

MBNR: జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం ఒక మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన నిందితుడు యెర్ర సురేష్‌కు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించింది. 2022లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టి, చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్ష పడింది.

March 4, 2026 / 09:01 AM IST

నేటి నుంచి ఇంటర్ వ్యాల్యూయేషన్

NLG: ఇంటర్ పరీక్షల మూల్యాంకనం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానుంది. ముందుగా సంస్కృతం పేపర్ వ్యాల్యూయేషన్ చేపట్టగా, ఈ నెల 15న మరో నాలుగు సబ్జెక్టులు, 16, 17 తేదీల్లో మిగిలినవి ప్రారంభమవుతాయి. NLGలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతం మూల్యాంకనానికి నియమితులైన అధ్యాపకులు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని DIEO సూచించారు.

March 4, 2026 / 09:01 AM IST

నాడు సైమా, నేడు నంది అవార్డ్

SDPT: చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కత్తుల నర్మదకు హైదరాబాదులోని బిర్లా మందిరం భాస్కరాచార్య ఆడిటోరియంలో బ్యూటిషన్ రంగంలో చేసిన సేవలకు నంది అవార్డును బాబు మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా కత్తుల నర్మద మాట్లాడుతూ.. ఏ రంగంలో అయినా పట్టుదలతో, సమయ స్ఫూర్తితో, కష్టపడి పని చేస్తేనే గుర్తింపు వస్తుందని ఆమె అన్నారు.

March 4, 2026 / 08:47 AM IST

శాంతినగర్ ఆలయం భక్తులకు తెరవడం

GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌లో ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని గ్రహణం సందర్భంగా మూసివేసి, సంప్రోక్షణ అనంతరం నేడు భక్తులకు తిరిగి తెరిచారు. అర్చకులు వినయ్ కౌశల్ శర్మ పూజాదికాలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రహణం ముగిసిన సందర్భంగా భక్తులు గోమాతను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

March 4, 2026 / 08:45 AM IST

ముఖ్యమంత్రికి జిల్లా ప్రగతి నివేదిక

KMR: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై సీఎం దిశానిర్దేశం చేశారు.

March 4, 2026 / 08:45 AM IST

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే మాతృవియోగం

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి జి.మంగమ్మ మంగళవారం మృతి చెందారు. విశయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. ఫోన్ ద్వారా పరామర్శించి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు.

March 4, 2026 / 08:44 AM IST

కృష్ణానదిలో అక్రమ ఇసుక రవాణా పట్టివేత

కృష్ణానది నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కృష్ణా మండలం గుడెబల్లూరు వద్ద అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో చర్యలు చేపట్టారు. ఈ దాడిలో ఒక టిప్పర్‌తో పాటు ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై నవీద్ తెలిపారు.

March 4, 2026 / 08:44 AM IST

ఖమ్మం జిల్లాలో నయా మోసం

ఖమ్మం జిల్లాలో నకిలీ మొక్కల ముఠా రైతులను మోసం చేస్తోంది. కేరళ నుంచి నాణ్యమైన మామిడి మొక్కలు తెస్తామని చెప్పి నకిలీ బిల్లులతో ఒక్కో మొక్కకు రూ.370 వసూలు చేస్తున్నారు. తిరుమలాయపాలెం పాతర్లపాడుకు చెందిన రైతు నుంచి వారు రూ.23 వేలు కాజేశారు. దీంతో అపరిచితులకు ఫోన్‌పే, జీపే చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

March 4, 2026 / 08:42 AM IST

రాజాపూర్ ఎస్సై రాజశేఖర్‌కు సన్మానం

MBNR: రాజాపూర్ మండలానికి నూతన ఎస్సైగా రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల అంబేద్కర్ సంఘం నాయకులు శాలువాతో సన్మానించారు. సైబర్ క్రైమ్, అపరిచిత మెసేజీలు సహా నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

March 4, 2026 / 08:41 AM IST

నేడు గరికపాటి నరసింహారావు ప్రవచనం

NGKL: మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు బుధవారం కొల్లాపూర్‌కు రానున్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణమండపంలో సాయంత్రం 5 గంటలకు ఆయన ప్రవచన కార్యక్రమం ఉంటుందని ఆర్యవైశ్య సంఘం నేత సుదర్శన్ శెట్టి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

March 4, 2026 / 08:38 AM IST

ఇరాన్‌తో HYDకు స్పెషల్ ATTACHMΕΝΤ..!

HYD: ఇరాన్‌తో HYDకు విడదీయరాని అనుబంధం ఉంది. బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం, జామున్, జిలేబీ, సమోసా ఇరానీలు పరిచయం చేసినవే. గోల్కొండ, చార్మినార్ చారిత్రక కట్టడాల్లోనూ పర్షియన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇక్కడి తెలుగు, ఉర్దూ భాషలపైనా ఇరాన్ పదాల ప్రభావం ఉంది.

March 4, 2026 / 08:38 AM IST

ఘనంగా గుడి బండ్ల జాతర

KNR: వీణవంక మండలం చల్లూరులో వెలసిన రుక్మిణి సత్య భామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. మంగళవారం స్వామివారి ఆలయం చుట్టూ నిర్వహించిన శకటోత్సవం (బండ్లు తిరుగుట) భక్తజన సందోహం మధ్య వైభవంగా జరిగింది. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన శకటాలపై స్వామివారు కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.

March 4, 2026 / 08:33 AM IST

నేటి నుంచి హెల్త్ మిషన్ 100 డేస్ క్యాంపెనింగ్

BDK: జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ‘హెల్త్ మిషన్ – 100 డేస్ క్యాంపెయిన్’ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్యాధికారి (DMHO) తుకారాం రాథోడ్ తెలిపారు. జూన్ 9 వరకు నాలుగు దశల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు తొలి దశ, ఏప్రిల్ నుంచి జూన్ వరకు మిగిలిన దశలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

March 4, 2026 / 08:30 AM IST

సోలార్ వినియోగ ప్రోత్సాహానికి సీఎం సూచనలు

PDPL: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన కలెక్టర్ల సదస్సులో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. 99 రోజుల కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించారు. సోలార్ వినియోగాన్ని ప్రోత్సహించి, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సభల్లో వెల్లడించాలని ఆదేశించారు.

March 4, 2026 / 08:29 AM IST

‘ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక అమలు చేయాలి’

ADB: ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా వ్యవహరించే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహించనున్నాట్లు తెలిపారు.

March 4, 2026 / 08:19 AM IST