NLG: జిల్లా పశువైద్య సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ జీవీ రమేశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ పదోన్నతిపై నల్గొండకు వచ్చారు. అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
HYD: ఓయూ పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ (ఇయర్ వైజ్), బీఈడీ (సెమిస్టర్ వైజ్), ఎంఈడీ (సెమిస్టర్ వైజ్) వన్ టైం ఛాన్స్ పరీక్షలను వచ్చే నెల ఆరవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
NLG: NLG-KMM-WGL ఉపాధ్యాయ MLC నియోజకవర్గ ఎన్నికల పోలింగ్కు మరో 5 రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే MLC ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో 518 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
RR: GMR గ్రూప్ నిర్వహణలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టింది. ఈ విస్తరణతో ప్రయాణికుల వార్షిక రాకపోకలు 2031 నాటికి ఐదు కోట్లకు పెరగనున్నాయి. రూ.370 కోట్ల పెట్టుబడితో కార్గో టెర్మినల్ వార్షిక సామర్ధ్యాన్ని నాలుగు లక్షల టన్నులకు పెంచనున్నట్టు సంస్థ CEO ప్రదీప్ ఫణిక్కర్ వెల్లడించారు.
NLG: విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె మునుగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ, బాలికల, బాలుర వసతి గృహాలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిచాలన్నారు.
JGL: వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి గ్రామ ఆదర్శ విద్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు వర్మి కంపోస్టును తయారు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని వ్యర్థాలను ఒక చోట పోగు చేసి కిచెన్ బెడ్లో కూరగాయలను సహజ సిద్ధంగా ఎరువు తయారు చేయడం కోసం ఈ వర్మి కంపోస్ట్ గొయ్యి తయారు చేయడం జరిగిందని తెలిపారు.
HYD: మెహిదీపట్నంలో గురువారం కానిస్టేబుల్ సంతోశ్రావు ప్రమాదంలో అపస్మారక స్థితిలోకి వెళ్లగా లంగర్ హౌస్ కానిస్టేబుల్ బీ.నరేశ్ కుమార్ CPR చేసి ప్రాణాలు కాపాడిన సంగతి తెలిసిందే. తన సేవలను అభినందిస్తూ నేడు సౌత్వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్, ఉన్నతాధికారుల బృందం పూలమాలవేసి శాలువా కప్పి సన్మానించి సర్టిఫికేట్ అందించారు.
SRD: జహీరాబాద్లోని అల్గొల్ రోడ్లోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహాశివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ను నిర్వాహకులు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 25 నుండి 27 వరకు జాతర కొనసాగుతుందని అన్నారు. మూడు రోజుల పాటు దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిపారు.
SDPT: జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గరిమా అగ్రవాల్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల ప్రాంగణంలోని తరగతి గదులను, భోజనశాలను, వంటశాలను, డార్మిటరీని తనిఖీ చేశారు. బాత్రూం టాయిలెట్లను కూడా తనిఖీ చేసి, పరిశుభ్రత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
BHNG: జిల్లాలో వాటర్ ప్లాంట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటర్ ప్లాంట్ పెట్టాలంటే భూగర్భ శాఖ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇవి ఏమీ లేకుండానే ప్లాంట్స్ పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనధికార ప్లాంట్స్ గురించి ఫైన్ దాదాపు లక్ష రూపాయలకు వేసే అధికారం భూగర్భ శాఖ అధికారులకు ఉన్న పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
NLG: వేసవి కాలం రాను నందున అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ కార్యదర్శులను తహసిల్దార్ ఆంజనేయులు కోరారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని తాసిహల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు..
RR: చేవెళ్ళ మండలం నాంచేరి గ్రామంలో శివ స్వాముల మహా పడి పూజోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బీజేపీ మండల అధ్యక్షులు అత్తెలి అనంత్రెడ్డి శుక్రవారం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆ కార్యక్రమంలో నాయకులు, కార్యర్తలు, శివస్వాములు, స్థానిక భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దపల్లి: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాదులో BRS మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవితకు పుష్పగుచ్ఛం అందజేశారు. పెద్దపల్లి జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి స్రవంతి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
KNR: వికసిత భారత్లో భాగంగా 2025-26 కేంద్ర బడ్జెట్పై ఇవాళ కరీంనగర్లో మేధావుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరీ జయశ్రీ, తదితరులు పురందీశ్వరికి స్వాగతం పలికారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఫ్యామిలీ బ్లూమ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధునిక కాలంలో పిల్లలకు మమతను రాగాలు, బాంధవ్యాలు అనేవి తెలియకుండా పోతున్నాయని వాటిపై అవగాహన కల్పించామని వారు తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను తప్పనిసరిగా గౌరవించాలని సూచించారు.