MLG: వెంకటాపూర్(M)లోని పొర్కలపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల నర్సయ్య శనివారం అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్దివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కలెక్టరేట్లో హాస్టల్ వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలన్నారు. భోజనం, స్టడీ అవర్స్ సమయంలో వార్డెన్లు తప్పనిసరిగా హాజరై ఉండాలని, హాస్టళ్లలోనే నివసించాలని స్పష్టం చేశారు. కేటాయించిన బడ్జెట్ను నెలాఖరు లోపు పూర్తిగా వినియోగించుకోవాలన్నారు.
SRD: పటాన్ చెరు మండల నందిగామలో 29 నుంచి జరిగే మహాచండి యాగానికి జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ కుటుంబాన్ని ఆహ్వానించినట్లు పటాన్ చెరు నియోజకవర్గ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా కాట మాట్లాడుతూ నందిగామ వెంకటేశ్వర స్వామి కళ్యాణమహోత్సవానికి సతీ సమేతంగా హాజరు కావాలని జిల్లా మంత్రిని ఆహ్వానించినట్లు తెలిపారు.
MDK: నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో శనివారం రూ.7 లక్షల వ్యయంతో ప్రధాన రోడ్డుకు సీసీ రోడ్డు పనులను సర్పంచ్ బత్తుల స్వప్న ప్రారంభించారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, ఉపసర్పంచ్ రామచంద్రం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ASF: సిర్పూర్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసెంబ్లీలో సిర్పూర్ MLA హరీష్ బాబు శనివారం ప్రస్తావించారు. వేసవి కాలం నేపథ్యంలో ప్రతి గ్రామానికి కనీసం రెండు బోర్వెల్స్ ఈ ఏడాదిలోనే మంజూరు చేయాలని కోరారు. అయితే కనీసం బోరు వేయాలన్నా MLAలు, కలెక్టర్ల వద్ద నిధులు లేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 36వ డివిజన్ జ్యోతి బసునగర్లోని RS నగర్ గుడిసెవాసులకు సంబంధించిన ఆస్తి పన్నును ఆ కాలనీ అధ్యక్షుడు గుడల రమేష్ రూ. 8 లక్షలను శనివారం మున్సిపల్ అధికారులకు చెల్లించారు. రమేష్ మాట్లాడుతూ.. పన్ను రసీదులో హౌస్ హోల్డర్ స్థానంలో గుడిసెవాసుల పేర్లు నమోదు చేయాలని ఆయన అధికారులను కోరారు. ఆస్తిపన్ను చెల్లించడంలో పేదలు ముందంజలో ఉన్నారని అధికారులు ఉన్నారు.
SDPT: వేసవిలో ఎండ వేడిమికి దాహార్తితో అల్లాడుతున్న పక్షులకు చిన్నారులు తమవంతు సాయం అందిస్తున్నారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్ కు చెందిన చిన్నారులు అకిరా నందన్, అద్వైత్, కొబ్బరి చిప్పలతో పక్షులకు నీరు అందిస్తున్నారు. ఇంటి ముందు పెరటి తోటలో చల్లని నీటిని అందిస్తూ పక్షుల ప్రాణాలు కాపాడుతున్నారు. చిన్నారుల సేవ గుణం చూసి పలువురు పిల్లలను ప్రశంసిస్తున్నారు
SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ, 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు రూ.13 లక్షల అంచనాతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఇందిరమ్మ కాలనీలో రూ.7.50 లక్షలతో చేపట్టనున్న మురికి కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
MHBD: IFTU మహబూబాబాద్ జిల్లా జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి అన్నారు. కేసముద్రం సెంటర్, బేరువాడ గ్రామంలో జనరల్ కౌన్సిల్కు సంబంధించిన పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకుని కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
HNK: శాయంపేట మండలం మైలారం గ్రామం నుండి జోగంపల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో విద్యుత్ తీగలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. మిషన్ భగీరథ పంప్ హౌస్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు ఒరగడంతో తీగలు కిందికి వేలాడుతున్నాయి. దీంతో ఆ దారిలో వెళ్లే ప్రయాణికులు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించాలన్నారు.
JN: ఘనపూర్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి విజయ రామారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని, బీజేపీ పార్టీ బలోపేటమే ప్రధాన లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేస్తూ కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
KNR:సైదాపూర్ మండలం వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ శనివారం జరిగిన విషయం తెలిసిందే. పీఏసీఎస్ పర్సన్ ఇన్ఛార్జ్ ముంజాల శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఘనంగా సత్కరించారు. సంఘం పరిధిలోని వెన్నంపల్లి సర్పంచ్ చిరంజీవి, ఆరెపల్లి-లావణ్య, లస్మన్నపల్లి-స్వప్న, గర్రెపల్లి-శ్రీకాంత్, ఏక్లాస్పూర్-భాగ్య లక్ష్మిని శాలువాలతో సత్కరించారు.
JGL: మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
MNCL: బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏప్రిల్ 7న మంచిర్యాలలో 24 గంటల నిరవధిక దీక్ష చేపట్టనున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా దేశంలో బీసీ ఉద్యమాలు నడుస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.
VKB: మోమిన్పేట్ మండలం కేసారం గ్రామంలో విషాదం నెలకొంది. భూమి తన పేరు మీద మార్చలేదన్న మనస్తాపంతో నాగరాజు అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఉరివేసుకొన్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.